ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ
భైంసా, ఫిబ్రవరి 12: పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిస్తోందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. భైంసాలోని నర్సింహానగర్లో గల నర్సింహ కల్యాణ మండపంలో శనివారం 187 మంది లబ్ధిదారులకు
మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదకుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, వైస్చైర్మన్ ఆసిఫ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసీల్దార్ విశ్వంబర్, కౌన్సిలర్ కపిల్ షిండే, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి రాము, భోజన్న, ఎంఐఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కుంటాల, ఫిబ్రవరి 12 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. కుంటాలలోని రైతు వేదికలో 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్షి, షాదీముబార్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో రోడ్ల అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దొనికెన సమత, ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు శంకర్ గౌడ్, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ప్రవీణ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
కుంటాల, ఫిబ్రవరి 12: నిరుద్యోగ యువత స్కిల్హబ్ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుంటాలలోని ఆదర్శ పాఠశాలలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన స్కిల్హబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల పాటు కొనసాగే కార్యక్రమంలో ఐటీఈఎస్, ఐటీ, యూటీ, వెల్నెస్ వృత్తులపై ప్రత్యేక శిక్షకుల ద్వారా యువతకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. స్కిల్ ఇండియా హబ్ కార్యక్రమానికి నిర్మల్ జిల్లాలో కుంటాల ఆదర్శ పాఠశాల ఎంపిక కావడం అభినందనీయమన్నారు. అనంతరం అదనపు గదులు, లైబ్రెరీని ప్రారంభించారు. పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్, సర్పంచ్ సమత వెంకటేశ్, ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ కొత్తపెల్లి గంగామణి బుచ్చన్న, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస ప్రసాద్, ఎంటీసీలు, సర్పంచ్లు, ఉపాధ్యాయులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.