హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు(Mainampally Hanumantha Rao)కు లోకాయుక్త (Lokayukta)షాకిచ్చింది. అతుడు, అతని కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కుటుంబ సభ్యులపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని తెలంగాణ లోకాయుక్త ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది అక్టోబర్ లో రామారావు ఇమ్మానేని అనే సీనియర్ న్యాయవాది మైనంపల్లి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న అవినీతి(Corruption), ఆదాయానికి మించిన ఆస్తులు తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో దర్యాప్తు చేయించాలని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.