న్యూఢిల్లీ: కరోనా కల్లోలంలో హీరోగా నిలిచిన ప్రముఖ విలన్ పాత్రధారి సోనూసూద్ పై గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా ఇన్స్టాగ్రాంలో ప్రశంసలు కురిపించారు. కరోనా కారణంగా అనాథలైన పిల్లల గురించి ఏదైనా చేయాలని సూద్ పిలుపునివ్వడంపై ఆమె ప్రత్యేకంగా స్పందించారు. ఆయనను దార్శనికుడైన దాతగా ప్రియాంక అభివర్ణించారు. సోనూ ఏదైనా చాలాముందే ఆలోచిస్తారని పేర్కొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్ల కోసం చేతనైనంత సాయం చేయాలని తన అభిమానులకు ఆమె పిలుపునిచ్చారు. ఇది పిల్లల సమస్య. దీని ప్రభావం దీర్ఘకాలికమైంది. కరోనా కల్లోలంలో ఒకరు లేదా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి నిస్సహాయులరైపోయిన పిల్లల గురించి ఆలోచించాల్సి ఉంది. చాలామంది చదువులు ఆగిపోవచ్చు.. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టవచ్చునని ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ బాధితులైన అనాథలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని సోనూ సూచించడం ఆయన దార్శనికతకు నిదర్శనమని ప్రియాంక తెలిపారు. సోనూ ఈ మేరకు చేసిన విజ్ఞప్తిని ఆమె ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు.
https://www.instagram.com/tv/COZ_xWVnL3T/?utm_source=ig_embed