హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల మార్కుల మెమోలను (Inter 1st year memos) ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేయనుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు తమ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు https://tsble.cgg.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫెయిలైన విద్యార్థులకు కూడా కనీస పాస్ మార్కులు వేసినట్టు పేర్కొన్నారు.
కాగా, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజు వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. రీకౌంట్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఫస్టియర్ విద్యార్థులు సాయంత్రం 5 గంటల నుంచి తమ దరఖాస్తులను రద్దుచేసుకోవచ్చని వెల్లడించారు. ఈనెల 17 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. చెల్లించిన ఫీజును ఫిబ్రవరి 1 నుంచి కాలేజీల్లో తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొన్నది.