‘పుష్ప’ జాతీయ స్థాయిలో తిరుగులేని వసూళ్లు రాబట్టడంతో పాటుగా.. హీరో అల్లు అర్జున్కు ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో ‘ఐకాన్ స్టార్’ జాతీయస్థాయిలో దూసుకెళ్తున్నారు. బాలీవుడ్ అగ్రహీరోలను వెనక్కి నెట్టేసి.. టాప్-10 సెలెబ్రిటీల జాబితాలో చోటు దక్కించుకున్నారు. పలు వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా సంతకాలు చేశారు. దీంతో ఆయా కంపెనీల మార్కెట్ విలువ కూడా పెరిగిపోయింది. ఈ జాబితాను హంస రీసెర్చ్ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. 85 శాతం స్కోర్తో అల్లు అర్జున్ టాప్టెన్లో చోటు దక్కించుకోగా.. 74 శాతం స్కోర్తో టాప్టెన్కు ఒక్క అడుగు వెనక మిగిలిపోయారు సమంత రూత్ప్రభు.
ఆ తర్వాతి స్థానంలో రష్మిక మందన్న నిలిచారు. అల్లు అర్జున్.. జొమాటో, రెడ్బస్, ర్యాపిడో వంటి బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తుండగా.. కుర్కురే, మింత్రా, మంచ్, ఫోన్పే మొదలైన బ్రాండ్స్కు సమంత వాణిజ్య రాయబారి. ఈ టాప్టెన్ లిస్టులో అగ్రస్థానం బిగ్-బి అమితాబ్దే. సచిన్, ధోనీ, విరాట్ కోహ్లీ, కపిల్శర్మ, మౌనిరాయ్, భువన్ బామ్, కొందరు సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తదుపరి స్థానాల్లో ఉన్నారు. సౌత్నుంచి అల్లు అర్జున్, సమంతతో పాటు.. రష్మిక మందన్న, సూర్య, విజయ్ దేవరకొండ, మహేశ్బాబు, రామ్ చరణ్, మోహన్లాల్, ఎన్టీఆర్, శృతి హాసన్, చైతన్య అక్కినేని వంటి నటీనటుల బ్రాండ్లను బేరీజు వేసుకొని స్కోర్ ఇచ్చినట్టు హంస రీసెర్చ్ సీఈవో ప్రవీణ్ నిజారా వెల్లడించారు.