గణేశ నవరాత్రుల వేళ.. ఖైరతాబాద్ వినాయకుణ్ని దర్శించుకోవాలని, ఆయన సన్నిధిలో కుటుంబ సమేతంగా పూజలు చేయాలని, స్వామివారి దివ్య ప్రసాదాన్ని పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు హైదరాబాద్కు రావడం, గణేషుడ్ని దర్శించుకోవడం ఓ యజ్ఞమనే చెప్పాలి. అందుకే, హైదరాబాద్ వరకూ రాలేనివారు ఇంటివద్దనే ఆన్లైన్ ద్వారా ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకోవచ్చు. ఆయన సన్నిధిలో అర్చన నిర్వహించొచ్చు. ప్రత్యక్షంగా ఆ పూజా కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. లడ్డు వేలంపాట తర్వాత, ప్రసాదాన్ని కొరియర్ ద్వారా పొందొచ్చు. ఇందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది టీహబ్తో కలిసిపనిచేస్తున్న ‘దేవసేవ’ (www.devaseva.com) అనే స్టార్టప్. అంతేకాదు, గరికపూజకు కూడా సన్నాహాలు చేసింది దేవసేవ.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ పూజలు నిర్వహిస్తూ..
తీర్థప్రసాదాలను కొరియర్ ద్వారా పంపుతున్నదీ సంస్థ.