బహుమతి అంటేనే తీసుకొనేవారికి ప్రత్యేకం, ఇచ్చేవారికి అపురూపం. వాటిని సాదా సీదాగా షాపుల్లో కొనేసి ఇవ్వకుండా, ‘పర్సనలైజ్డ్’గా తయారు చేయించి ఇస్తే ఆ అనుభూతే వేరు. నచ్చిన వస్తువుపై పెయింటింగ్ వేయించి ఇవ్వడం లేటెస్ట్ ట్రెండ్గా మారింది. నవతరం కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు ఆంత్రప్రెన్యూర్గా మారింది ముంబైకి చెందిన ఆర్టిస్ట్ కనికా రంక. మనం ఎంపిక చేసుకొన్న గిఫ్ట్లను ఆమె చేతికిస్తే, వాటిపై మైమరిపించే చిత్రాలను వేస్తుంది. కాలిజోళ్ల నుంచి టీ షర్ట్ వరకు, హ్యాండ్ బ్యాగ్ నుంచి కాఫీ కప్పు వరకు.. ఏదైనా సరే! ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగో నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన కనికకు పెయింటింగ్స్ అంటే ఆసక్తి. “నేను కస్టమర్లతో ఎక్కువసేపు మాట్లాడతాను. గిఫ్ట్ అందుకోబోయేవారి వ్యక్తిగత ఇష్టాలను పూర్తిగా తెలుసుకొంటాను. తర్వాతే, పని మొదలుపెడతాను. పెండ్లి, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే.. ఇలా సందర్భాన్నిబట్టి థీమ్ ఎంచుకొంటాను. ఒక్కో పెయింటింగ్కు 48 గంటల సమయం వెచ్చించిన సందర్భాలూ ఉన్నాయి” అని చెబుతున్నది కనిక.