రకుల్ ప్రీత్ సింగ్.. ప్రీతితో తన ప్రేమను గెలిపించుకుంది. మూడుముళ్లు, ఏడడుగుల వరకూ తీసుకెళ్లింది. ‘వాలెంటైన్స్ మంత్’లోనే ప్రియుడు జాకీ భగ్నానీని మనువాడనున్నట్టు ప్రకటించింది. ‘కాస్మోపాలిటన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ప్రేమ సూత్రాలూ వెల్లడించింది.