మాస్క్.. కరోనా నుంచి కాపాడుతుంది. కానీ, మాస్క్ దుష్ప్రభావాల నుంచి చర్మాన్ని కాపాడేదెవరు? ఈ విషయంలో మనకు మనమే రక్ష. గత రెండేండ్ల నుంచి ఫేస్ మాస్క్, శానిటైజర్, గ్లౌజ్ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కానీ, గంటల తరబడి ముఖానికి మాస్క్ పెట్టుకోవడంతో చర్మ సమస్యలు అధికంఅవుతున్నాయి. మొటిమలు, దద్దుర్లు, దురద చుట్టుముడుతున్నాయి. అదేపనిగా శానిటైజర్లు వాడటంవల్ల చర్మం పొడిబారిపోతున్నది, గోళ్లకు పగుళ్లు వస్తున్నాయి. రోజూ రాత్రి నిద్రపోయే ముందు చేతులకు, గోళ్లకు, చర్మానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. రెండురోజులకు ఓసారి 50 మిల్లీలీటర్ల రోజ్ వాటర్లో ఒక టీ స్పూన్ గ్లిజరిన్ కలిపి, ఆ మిశ్రమాన్ని చేతులకు రాసి అరగంట తర్వాత కడిగేయాలి. మాస్క్ కప్పేసే ప్రాంతంలో మేకప్ వేయకూడదు. మాస్క్ ఎంపికలో కూడా జాగ్రత్త అవసరం. నూలు, సహజమైన పట్టు మాస్క్లు మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల దురద, మంట వంటి సమస్యలు రావు. హ్యాలు
రోనిక్ యాసిడ్గల మాయిశ్చరైజర్, సీరమ్, క్రీములను రోజుకు రెండుసార్లు చర్మానికి రాయాలి. తాగునీటితో పాటు కొబ్బరినీళ్లు, పండ్లరసాలు, సూప్లు, మజ్జిగ, నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకుంటే చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది.