మహేశ్బాబు, ఆయన గారాలపట్టి సితార తొలిసారిగా బుల్లితెరపై కనువిందు చేయనున్నారు. ఈ అరుదైన కలయికకు వేదికైంది జీ తెలుగు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’. ఈవెంట్లో మహేశ్ తనదైన కామెడీ టైమింగ్తో అలరించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సితారకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఆ ప్రేమే నన్ను ఈ షోకు తీసుకొచ్చింది. ఒక టీవీ వేదిక మీద మేమిద్దరం కలిసి కనిపించడం మొదటిసారి. ఇదో అందమైన జ్ఞాపకం’ అన్నారు మహేశ్. ‘నేను ఓ టీవీ షోలో స్టేజీ పైకి రావడం ఇదే మొదటిసారి. నాన్న పక్కన ఉండటం వల్ల అస్సలు భయం అనిపించలేదు. ఇక్కడ డ్యాన్స్ చేసిన కంటెస్టెంట్స్ ప్రతిభ నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చింది’ అని చెప్పింది సితార. ఈ రియాలిటీ షో ఈ రోజు రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.