కావాల్సిన పదార్థాలు
ఓట్స్: ముప్పావు కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద:
అర టేబుల్ స్పూన్, నెయ్యి: ఒక టీ స్పూన్, లవంగాలు: మూడు, ఉప్పు: చిటికెడు, పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్, టమాట తరుగు: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ తరుగు: ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క: చిన్న ముక్క, గరం మసాల: అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు: ఒక టేబుల్ స్పూన్, పుదీనా తరుగు: ఒక టేబుల్ స్పూన్, బూందీ: రెండు టేబుల్ స్పూన్లు,
నిమ్మకాయ: ఒకటి.
తయారీ విధానం
ముందుగా ఓట్స్ను దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి. స్టవ్పై పాన్లో నెయ్యి వేడిచేసి లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు వేయించాలి. తర్వాత టమాట, పచ్చిమిర్చి తరుగు వేయాలి. రెండునిమిషాలు గడిచాక అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. ఆపైన కొత్తిమీర, పుదీనా తరుగు వేయాలి. అందులో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. అలా మరుగుతున్నప్పుడు మంట చిన్నగా చేసి, ఉప్పు, గరంమసాల కలపాలి. ఇప్పుడు, ఓట్స్ వేసి ఓ మోస్తరు మంటపై ఐదారు నిమిషాలు ఉడికించాలి. చివరగా ఓట్స్ గంజిలో బూందీ, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకోవాలి.