ఈ వారం ఓటీటీ ప్రియులకు మంచి వినోదం లభించనుంది. ఫీల్గుడ్ సినిమాగా మంచి కలెక్షన్లు సొంతం చేసుకున్న విశ్వక్సేన్ తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ జూన్ 3వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు బ్లాక్బస్టర్ చిత్రం ‘కేజీఎఫ్-2’ అమెజాన్ ప్రైమ్లో ఫ్రీ స్ట్రీమింగ్ మొదలవుతున్నది. ఈ నెల 30న నెట్ఫ్లిక్స్లో ‘మైటీ లిటిల్ భీమ్’ యానిమేషన్ చిత్రం విడుదల అవుతున్నది. ఇదే ఓటీటీలో జూన్ 3 నుంచి ‘ద పర్ఫెక్ట్ మదర్’ సీజన్ 1 స్ట్రీమింగ్ కానుంది. జీ5లో జూన్ 10న రెండు సస్పెన్స్ చిత్రాలు ‘ద బ్రోకెన్ న్యూస్’, ‘ద ఫోరెన్సిక్’ విడుదల అవుతున్నాయి.
వెండితెర మెరుపులు
ఈ శుక్రవారం థియేటర్స్లో భారీ చిత్రాలు సందడి చేయనున్నాయి. వర్సటైల్ హీరో కమల్హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’, అడివి శేష్ ‘మేజర్’, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ‘జరిగిన కథ’ చిత్రాలు విడుదల అవుతున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ కూడా జూన్ 3న బాక్సాఫీస్ ముందుకు వస్తున్నది.
కళలతో కాలక్షేపం
అభిరుచి ఉన్నవారికి ఈ వారంలో పలు ఈవెంట్లు స్వాగతం పలుకుతున్నాయి. జూన్ 3 రాత్రి 7 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ‘ద ఎస్ ట్రయాంగిల్ ’ పేరుతో శంకర్ మహదేవన్, శివమణి, స్టీఫెన్ దేవసీ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు ఫిల్మ్ నగర్లోని ఆలోమేల్ కేఫ్లో హిందీ కామెడీ షో ‘నోస్టాల్జియా’ ఉంది. జూన్ 3న రాత్రి 7.30 గంటలకు పార్క్ హయత్లో ‘అండర్ యాన్ ఓక్ ట్రీ’ ఇంగ్లిష్ నాటకం ప్రదర్శించనున్నారు. ఈ ఈవెంట్ల టికెట్లు ‘బుక్ మై షో’ యాప్లో లభిస్తాయి.