ప్రస్తుతం చాయ్ డబ్బా, తోపుడు బండి, సూపర్ మార్కెట్.. ఎక్కడైనా ఇ-పైసలే. అయితే, అన్నిటికీ ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు లింక్ చేయడంవల్ల సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. అందుకే, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
వర్చువల్ కీబోర్డ్ : ఏ ఆన్లైన్ లావాదేవీ అయినా, వెబ్సైట్లోకి వెళ్లగానే వర్చువల్ కీబోర్డ్ ఆప్షన్ను ఎంచుకోవాలి.
ఎస్ఎంఎస్ అలర్ట్స్ : బ్యాంకుల్లో రిజిస్టర్ అవుతున్నప్పుడే ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ అలర్ట్స్ వచ్చేలా ఆప్షన్ పెట్టుకోవాలి.
ఓటీపీ తప్పనిసరి : ఏ చిన్న ఆర్థిక వ్యవహారమైనా ఓటీపీ వచ్చే ఏర్పాటు ఉండాలి. దీనివల్ల మన అకౌంట్ను హ్యాక్ చేయడం కష్టం.
పిన్ నెంబర్ మార్పు : చాలామంది పాస్వర్డ్స్ను పేపర్ మీద రాసి బ్యాగులో
పెట్టుకుంటారు. ఇది ప్రమాదకరం. తరచూ పిన్ మార్చుకోవడం సురక్షితం.