కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్: ఒక కప్పు, బాస్మతి రైస్: ఒక కప్పు, ఆలివ్ ఆయిల్: రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ: ఒకటి, వేయించిన నువ్వుల పొడి: ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు: రెండు, మిరియాల పొడి: పావు టీ స్పూన్, ఉప్పు: తగినంత, పుదీనా, కొత్తిమీర తరుగు: ఒక టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా బాస్మతి బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి, నూనె వేడయ్యాక మష్రూమ్ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. అన్నీ బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి, నువ్వుల పొడి వేసి ఉడికించిన బాస్మతి రైస్ని వేసి బాగా కలిపితే సరి. వేడి వేడి ‘మష్రూమ్ పులావ్’ రెడీ.