కావలసిన పదార్థాలు
బియ్యపు పిండి: ఒక కప్పు, శనగపిండి: అర కప్పు, పుట్నాల పిండి: పావు కప్పు, ఓము: ఒక టీ స్పూన్, కారం: రెండు టీ స్పూన్లు, ఉప్పు: తగినంత, వెన్న: ఒక టేబుల్ స్పూన్,
నూనె: వేయించడానికి సరిపడా, వంటసోడా: చిటికెడు.
తయారీ విధానం
ఒక గిన్నెలో బియ్యపు పిండి, శనగపిండి, పుట్నాల పిండి, కారం, ఓము, వంటసోడా, వెన్న, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు చల్లి ముద్దగా కలపాలి. స్టవ్మీద కడాయిపెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. పిండిని జంతికల గొట్టంలో పెట్టి కాగిన నూనెలో ఒత్తుకుని దోరగా కాల్చుకుంటే కరకరలాడే వెన్న మురుకులు సిద్ధం.