కావలసిన పదార్థాలు
మినుప పప్పు: ఒక కప్పు, ఉప్మా రవ్వ: పావు కప్పు, బియ్యపు పిండి: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
మినుప పప్పును బాగా కడిగి ఆరు గంటలపాటు నానబెట్టాలి. మిక్సీ జార్లో మినుప పప్పు, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్మా రవ్వ, బియ్యం పిండి వేసి మరికొన్ని నీళ్లు పోసి.. దోశల పిండికంటే కాస్త చిక్కగా ఉండేలా కలిపి గంటపాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక పిండి మిశ్రమాన్ని దోశలా వేసుకుని రెండువైపులా నూనె వేస్తూ కాల్చుకుంటే
నోరూరించే వేడివేడి మినుపట్టు సిద్ధం.