లాక్డౌన్ సమయంలో, బెంగళూరుకు చెందిన సాక్షి అగర్వాల్ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన ‘లంచ్బాక్స్ కేకులు’ కొత్త ట్రెండ్ను సెట్ చేశాయి. పేరుకు తగ్గట్టే ఇవి చిన్న లంచ్బాక్స్ పరిమాణంలో ఉంటాయి. ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. వీటిని ‘గెట్వెల్ సూన్’, ‘హోప్ యు బెటర్’ ‘స్టే సేఫ్.. ఎంజాయ్ ది డే’ వంటి సందేశాలతో అందిస్తున్నారు సాక్షి. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ కొత్త ట్రెండ్ హల్చల్ చేస్తున్నది కూడా. హాయిగా ఏ జొమాటోలోనో ఆర్డరు ఇచ్చి.. మెట్రో ప్రయాణంలో లంచ్బాక్స్ కేకులు ఆరగిస్తున్నవారి సంఖ్యా తక్కువేం కాదు.