భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్య బంధానికి 30 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో ఘనంగా సంబురాలు జరిగాయి. ఆ వేడుకల్లో అందరి కళ్లూ ఇజ్రాయెల్ వాద్యకారిణి, గాయని లిరోన్ మెయుహాస్ పైనే. ఆమె డ్రమ్ వాయిస్తూ.. పాటలు పాడుతుంటే అంతా మంత్ర ముగ్ధులై విన్నారు.
ఇజ్రాయెల్ మొట్టమొదటి మహిళా హ్యాంగ్ డ్రమ్ ఆర్టిస్ట్.. లిరోన్ మెయుహాస్. ఆమె పియానో, ఆఫ్రికన్ డ్రమ్, బాడీ డ్రమ్, గిటార్ తదితర వాద్య పరికరాలను కూడా లయబద్ధంగా పలికిస్తుంది. వాటికి అనుగుణంగా గాత్రం కలుపుతుంది. లిరోన్ వాయించే హ్యాంగ్ డ్రమ్ను 22 ఏండ్ల కిందట స్విట్జర్లాండ్కు చెందిన ఫెలిక్స్ రోహ్నర్, సబీనా స్కారెర్ తయారు చేశారు. తన 17వ ఏట ఇజ్రాయెల్ వీధుల్లో ఎవరో వాయిస్తుంటే చూసి, డ్రమ్పై మనసు పారేసుకుంది లిరోన్. ఆమెకు పండిట్ రవిశంకర్ సితార్ అన్నా, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా అన్నా చాలా ఇష్టం. అవకాశం వస్తే బాలీవుడ్లోని సంగీత దర్శకులతో పనిచేయాలని ఉందని మనసులోని మాట బయట పెట్టింది. త్వరలోనే భారతీయ తబలాతో పాటు శాస్త్రీయ సంగీతాన్నీ నేర్చుకుంటానని చెప్పింది లిరోన్.