ఫిట్గా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చనే విషయం అందరికీ తెలుసు. కానీ ఫిట్నెస్తో కోటి రూపాయలు సంపాదించి ఏకంగా ‘ఫిట్టర్ ఫిట్నెస్ చాలెంజ్-2021’ విజేతగా నిలిచింది జైపూర్ యువతి ధ్యాన్ సుమన్. పుణెకు చెందిన ‘ఫిట్టర్’ అనే సంస్థ నిర్వహించిన చాలెంజ్లో దేశం నలుమూలల నుంచీ పాల్గొన్న వందలమందిని వెనక్కి నెట్టింది.. 38 ఏండ్ల సుమన్. ఐటీ ఉద్యోగి అయిన సుమన్ ప్రఖ్యాత చిత్రకారుడు గోపాల్స్వామి కూతురు. ‘గాయాలు, ఆస్తమా, కొవిడ్ వంటి అడ్డంకులు ఎన్ని ఎదురైనా వెనక్కితగ్గకుండా శ్రమించాను. నా కృషికి ఫలితం దక్కింది’ అంటూ విజయానందాన్ని పంచుకుంటున్నది సుమన్. పదహారు వారాల పాటు ప్రతి పోటీదారు ఆహార విధానాన్ని, వ్యాయామాన్ని, జీవనశైలిని గమనించి.. అత్యుత్తమ ప్రతిభ కనబరచినవారికి ఈ బహుమతి ఇస్తారు.