ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో అతి తక్కువమంది మహిళలు ఉన్నారు. న్యాయమూర్తుల హోదాలో అయితే, వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. దీనికి కారణం ఏమిటి? ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డె చేసిన వ్యాఖ్యలు త్యాగమూర్తులైన స్త్రీలు కుటుంబం కోసం న్యాయమూర్తి హోదానూ వదులుకుంటున్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. “మా పిల్లలు టెన్త్లో ఉన్నారు, ఇంటర్లో ఉన్నారు. వాళ్లను చదివించాల్సిన బాధ్యత మాదే.. అంటూ కెరీర్ను కాదని కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అన్ని అర్హతలూ ఉన్నా తీర్పరి స్థానంలో కూర్చోలేకపోతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారాయన. నిజమే, హైకోర్టు న్యాయమూర్తులలో కేవలం పదకొండు శాతమే మహిళలున్నారు.