ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో సమృద్ధిగా లభించే పండు సీతాఫలం. ఆకుపచ్చగా, తియ్యగా ఉండే ఈ అమృత ఫలం శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. సీతాఫలంలో క్యాల్షియం, మెగ్నీషియం అధికం. ఇవి ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతాయి. విటమిన్ బి 6 ఎక్కువగా ఉంటుంది. దీనిలోని పీచు పదార్థం మధుమేహం నుంచి కాపాడుతుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. సీతాఫలం రోగ నిరోధకతను పెంపొందిస్తుంది. వాతాన్ని నివారిస్తుంది. కండ్లు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. అజీర్తిని అరికడుతుంది. అల్సర్లు, ఎసిడిటీని నివారిస్తుంది. చర్మానికి నునుపుదనాన్ని ఇస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతుంది. ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.