కావలసిన పదార్థాలు
కీర దోసకాయ : ఒకటి, చక్కెర: రెండు టీస్పూన్లు, ఉప్పు: చిటికెడు, మిరియాల పొడి: పావు టీస్పూన్, అల్లం: చిన్నముక్క, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్, ఐస్ క్యూబ్స్: నాలుగు, పుదీనా: నాలుగు ఆకులు.
తయారీ విధానం
తొక్క, గింజలు తీసిన దోసకాయను చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీజార్లో కీరా ముక్కలు, చక్కెర, పుదీనా, ఉప్పు, మిరియాల పొడి, ఐస్ క్యూబ్స్, అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తగినన్ని నీళ్లు, నిమ్మరసం కలిపి గ్లాసులో పోసుకుంటే ఆరోగ్యకరమైన కుకుంబర్ కూలర్ సిద్ధం.