హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆమెను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో ప్రస్తుతం వరంగల్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పమేలా సత్పత్తి బదిలీపై ఇక్కడికి రానున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తొలి కలెక్టర్గా అనితా రామచంద్రన్ జిల్లా అభివృద్ధికి విశేష సేవలందించారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయ నిర్మాణానికి ఈమె హయాంలోనే అంకురార్పణ జరిగింది. 2016 అక్టోబరు 11న యాదాద్రి భువనగిరి జిల్లా అవతరించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.