న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు భగభగ మండుతున్నాయి. మరోవైపు శిలాజ ఇంధనాల వినియోగంతో భూతాపం పెరిగిపోతున్నది. దీని నివారణకు సంప్రదాయేతర ఇంధనం దిశగా మళ్లాలని కేంద్రం భావిస్తున్నది. అందులో భాగంగా విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నది.
ఈ క్రమంలో ఎథేర్ ఎనర్జీ సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎథేర్ 450ఎక్స్తో సింగిల్ చార్జింగ్తోనే 116 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. ఇంటి దగ్గరే చార్జింగ్ చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంది. దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్గా ఇది నిలువనున్నది.
ఎథేర్ ఎనర్జీ స్కూటర్ల విక్రయాలు ప్రారంభం అయ్యాయి. బెంగళూరు కేంద్రంగా ఈ స్టార్టప్ సంస్థ పని చేస్తున్నది. ఏథేర్ 450 ఎక్స్ రెండు వేరియంట్లలోవస్తున్నది. మేడ్ ఇన్ ఇండియా స్కూటర్లలో ఇదీ ఒకటి.
450 ఎక్స్లో 450 ఎక్స్ ప్లస్, 450 ఎక్స్ ప్రో మోడల్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ల పనితీరులోనే డిఫరెన్స్ ఉంది. 450 ఎక్స్ స్కూటర్ 1,32,426లకు లభిస్తుండగా, 450 ప్లస్ 1,13,416లకు లభిస్తున్నది. ఏథెర్ 450 ఎక్స్తో పోలిస్తే ఏథేర్ 450 ప్లస్ నెమ్మదిగా ఉంటుంది. ఎథేర్ 450 ఎక్స్ స్కూటర్ 70 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది.
ఎథేర్ 450 ఎక్స్ 5.4 కిలో వాట్ల (సుమారు 7.2 బీహెచ్పీ) పవర్, 22 ఎన్ఎం టార్చ్ సామర్థ్యం కలిగి ఉంది. 6కిలోవాట్లతోపాటు 26 ఎన్ఎం టార్చ్ కల ఎథేర్ 450 ఎక్స్ మోడల్ కూడా ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ జత చేశారు.
ఎథేర్ 450ఎక్స్ స్పోర్ట్స్ స్కూటర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్, మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. వైట్, మేట్ గ్రే, గ్లోస్ మింట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. కంఫర్టబుల్ సీట్లతో ఫుల్ ఎల్-ఈడీ లైటింగ్ ఫెసిసిలిటీ ఉంది.
ఏడంగుళాల ఫుల్ కలర్ ఇన్స్రుమెంట్ కన్సోల్, బ్లూ టూత్ కనెక్టివిటీ, టచ్ స్క్రీన్ సెన్సిటివ్ కన్సోల్, స్క్రీన్ శాటిలైట్ నావిగేషన్ ఫీచర్లు ఉన్నాయి. ఇన్ కమింగ్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఫోన్ బయటకు తీయనవసరం లేదు. సమీపంలో చార్జింగ్ పాయింట్ తెలిపే ఫీచర్ కూడా జత చేశారు.