భర్త ఇంటి ముందు భార్య దీక్ష

వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం గ్రామానికి చెందిన సుర్కంటి రవీందర్రెడ్డి, సుజాతలు ఎదురెదురు ఇంట్లో ఉండేవారు. ఇద్దరు ప్రేమించుకొని పెద్దలకు తెలియకుండా ఆర్యసమాజ్లో 2015లో వివాహం చేసుకున్నారు. అనంతరం భార్యాభర్తలు అమెరికాలోని వర్జీనీయ రాష్ట్రంలో కాపురం పెట్టారు. వీరి కాపురం ఏడాదిపాటు సజావుగా సాగగా, భర్త తండ్రి అమెరికాకు రావడంతో కాపురంలో కలహాలు ప్రారంభమయ్యాయి. సమస్యలు సద్దుమణిగే వరకు విడిగా ఉండమని భర్త సూచించాడు. ఆయన మాటలను నమ్మి బాధితురాలు వేరే ఇంట్లో కిరాయికి ఉన్నది.
కొంతకాలం తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండటంతో భర్తను నిలదీయగా, మా ఇంట్లో మన పెండ్లి ఇష్టంలేదని, విడాకులు తీసుకుందామని చెప్పడంతో తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన భార్య రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు 2018లో అమెరికాలో ఉన్న భార్యాభర్తలను ఇండియాకు రప్పించి విచారించారు. భార్య సుజాతను భర్త అత్తవారింట్లో వదిలిపెట్టి అమెరికాకు తిరిగి వెళ్లి పోయాడు. అప్పటి నుంచి అత్తవారింట్లో ఉన్న సుజాతను భర్త కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేస్తున్నా భరిస్తూ వచ్చింది. చివరికి అత్తమామలు ఇంట్లో నుంచి గెంటివేశారు. దీంతో చేసేదిలేక న్యాయం కోసం భర్త ఇంటి ముందు మంగళవారం దీక్ష చేపట్టింది.
తాజావార్తలు
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్గా వైష్ణవ్తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
- అతివేగం ఖరీదు : బెంజ్ కారు నడుపుతూ వ్యక్తిని బలిగొన్న టీనేజర్!
- నీరవ్ కోసం ఆర్థర్ జైలులో ఏర్పాట్లు