హనుమకొండ చౌరస్తా, మే 9 : కార్మిక సంక్షేమ చైతన్య మాసోత్సవాల్లో భాగంగా ఈనెల 10, 11న ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ తెలిపారు. మంగళవారం హనుమకొండలోని ఇండో ర్ స్టేడియంలో వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్మికుల బిడ్డల పెళ్లిళ్లు, ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు అందిస్తున్నదని తెలిపారు. ప్రతి సంవత్సరం కార్మికులు రూ.110 చెల్లిస్తే ప్రమాదవశాత్తు మృతి చెందితే ఇన్సూరెన్స్ రూ.6.30 లక్షల వస్తాయని చెప్పారు. కార్మికుల మానసిక ఉల్లాసం కోసం బీఆర్ఎస్ పార్టీ, కార్మికశాఖ, కార్మి క సంఘాలు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 10 విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలు నిర్వహించే స్థలాలు, నిర్వాహకుల వివరాలను ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే ముఖ్యమంత్రి కప్ మండల స్థాయి క్రీడలను ప్రోత్సహించాలని, ఇప్పటికే మినీ స్టేడియానికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రూ.5 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్ మాట్లాడుతూ. కార్మికులు మానసిక ఒత్తి డి నుంచి ఉపశమనం కలిగించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్ నాయక్ మాట్లాడుతూ.. క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల్లో కార్మికులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు
పేర్లు నమోదు చేసుకోవాలి..
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ : కేశోజు ప్రణయ్ 83091 89981, కాజీపేట లేబర్ అడ్డా: సారంగపాణి 99892 06203, డబ్బాల లేబర్ అడ్డా: శ్రీనివాస్ 98490 73501, వడ్డేపల్లి లేబర్ అడ్డా: సదానందం 91826 95233, రఘుపతి 94403 67669, జేసీబీ లేబర్ అడ్డా : వెంకన్న 986688322, సుబేదారి లేబర్ అడ్డా: ఎండీ సాధిక్ 99594 94112, కొండయ్య 98483 68976, పబ్లిక్ గార్డెన్ అడ్డా: శ్యాం 9866416946 నంబర్లను సంప్రదించాలని కోరారు.
క్రీడా పోటీలివే..
మెన్స్ : అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్, షార్ట్పుట్, కబడ్డీ, వాలీబాల్, షటిల్(బ్యాడ్మింటన్), చెస్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్
ఉమెన్స్ : అథ్లెటిక్స్ 100 మీటర్స్ పరుగుపందెం, లాంగ్జంప్, షార్ట్పుట్, డిస్కస్ త్రో, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, కబడ్డీ, స్కిప్పింగ్, తగ్ ఆఫ్ వార్, టెన్నికాయిట్, చెస్
సరదాగా కాసేపు..
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం సరదాగా కాసేపు క్రీడాకారులతో షటిల్ ఆడారు. వేసవి క్రీడాశిక్షణ శిబిరంలో భాగంగా షటిల్ ఆడుతుతున్న క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్ వివాహ వేడుకలను నిర్వహించారు. కేక్ తినిపించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక మాసోత్సవ కో ఆర్డినేటర్లు పుల్లా శ్రీనివాస్, కేశోజు ప్రణయ్ పాల్గొన్నారు.