నర్సంపేట, ఫిబ్రవరి 17: నిత్యం తాగొచ్చి వేధిస్తున్నాడు. ఎంత చెప్పినా తన బుద్ధి మారడం లేదు. దీంతో విసిగారేసిన ఓ భార్య తన భర్తను హత్య చేసిన ఘటన దుగ్గొండి మండలంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన జరిపోతుల రాజు(48) మద్యానికి బానిసై నిత్యం భార్యతోపాటు కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు.
మద్యం అలవాటును మానుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా రాజు వినడం లేదు. శుక్రవారం రాత్రి కూడా రాజు మద్యం తాగొచ్చి భార్య లక్ష్మిని వేధించాడు. కోపోద్రిక్తులైన ఆమె సిమెంట్ ఇటుకతో రాజును కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత ఆమె పోలీస్స్టేషన్లో లొంగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నర్సంపేట రూరల్ సీఐ శ్రీనివాస్, దుగ్గొండి ఎస్సై పరమేశ్ నిందితురాలితోపాటు కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి విచారణ చేస్తున్నారు. శవ పంచనామా చేసి, పోస్టుమార్టానికి పంపించారు.