నిండు మనస్సుతో ఆశీర్వదించండి
సీఎం కేసీఆర్ పాలనలోనే ఇంటింటికీ సంక్షేమ ఫలాలు
29వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గుండు సుధారాణి
పలు కాలనీల్లో విస్తృత ప్రచారం.. అడుగడుగునా అపూర్వ స్వాగతం
వరంగల్, ఏప్రిల్ 25 : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఇందులో భాగంగా 29వ డివిజన్ అభ్యర్థి గుండు సుధారాణి పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో జోరు పెంచారు. ఆదివారం ఆమె డివిజన్లోని గాంధీబొమ్మ సెంటర్, వాసవి కాలనీ, గంగపుత్ర కాలనీ, పోతననగర్ రోడ్ ప్రాంతాల్లో కలియదిరిగారు. పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు తరలిరాగా ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సుధారాణికి బొట్టు పెట్టి అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికీ కేసీఆర్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం సుధారాణి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ఇంటింటికీ సంక్షేమ ఫలాలు సాధ్యమని పేర్కొన్నారు. గత పాలకులు పేదల బతుకులు ఆగం చేస్తే కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే నగరాభివృద్ధి జరిగిందని చెప్పారు. ఆరున్నరేళ్ల పాలనలో వరంగల్ ప్రగతిలో దూసుకుపోతోందని అన్నారు.
కోట్లాది రూపాయలతో నగర రూపురేఖలు మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తనను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని సుధారాణి హామీ ఇచ్చారు.