టీఆర్ఎస్లోనే కొనసాగుతాం..
స్పష్టం చేసిన కమలాపూర్ ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసిన ప్రజాప్రతినిధులు
కమలాపూర్, మే 23 : ‘టీఆర్ఎస్సే మా పార్టీ.., ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మా నాయకుడు’ అని కమలాపూర్ ఎంపీపీ తడక రాణీశ్రీకాంత్, జడ్పీటీసీ లాండిగ కల్యాణి, సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ పుల్లూరి రాంచందర్రావు, 21 గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్, మాజీ జడ్పీటీసీ మారపల్లి నవీన్కుమార్, మర్రిపెల్లిగూడెం గ్రామ పార్టీ శ్రేణులు అన్నారు. ఆదివారం వారు హన్మకొండలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసి స్పష్టం చేశారు. అసైన్డ్ భూముల ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ను మంత్రి పదవి నుం చి తొలగించడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కుల సంఘాల నాయకులు, టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అభివృద్ధికి పాటుపడుతున్నామని, పార్టీని వీడే ప్రసక్తేలేదన్నారు. వ్యక్తుల కోసం కాదని, పార్టీ ముఖ్యమన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు.
పార్టీ శ్రేణులకు అండగా చల్లా
అసైన్డ్ భూముల ఆక్రమణల ఆరోపణలతో పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలపై పట్టుకోల్పోయా రు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పర్యవేక్షణలో కమలాపూర్ మండల ఇన్చార్జిగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియమించారు. ఈ నేపథ్యంలో కమలాపూర్ మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ కోసం పని చేస్తామంటూ చల్లా ధర్మారెడ్డిని కలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్కుమార్, రాష్ట్ర నాయకుడు నాగుర్ల వెంకన్న, పర్యవేక్షకుడు డాక్టర్ పేర్యాల రవీందర్రావు, సర్పంచ్లు శ్రీరాంల లింగమూర్తి, లడే గోపాల్, దాసరి రమేశ్, అంకతి సాంబయ్య, పెండ్యాల రవీందర్రెడ్డి, కంచనకుంట్ల విజేందర్రెడ్డి, కడారి సాంబయ్య, ఎంపీటీసీలు గుర్రం వెంకటేశ్వర్లు, వీరమనేని భాస్కర్రావు, లింగారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, నాయకులు ప్రదీప్రెడ్డి పాల్గొన్నారు.