నర్సంపేట, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, కోర్టులో జడ్జి సాకేత్మిత్రా, మార్కెట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా మార్కెట్ అధికారి ప్రసాదరావు, ఏడీఏ కార్యాలయంలో శ్రీనివాసరావు, గ్రంథాలయంలో జిల్లా డైరెక్టర్లు గంప రాజేశ్వర్గౌడ్, పుట్టపాక కుమారస్వామి, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.
ఖానాపురం: మండలకేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వీ ప్రకాశ్రావు, తహసీల్లో తహసీల్దార్ సుభాషిణి, పోలీస్స్టేషన్లో ఏఎస్సై కుమారస్వామి, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ మండలాధ్యక్షుడు వెంకటనర్సయ్య జాతీయ జెండాలను ఎగురవేశారు.
నెక్కొండ: ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ జాటోత్ రమేశ్, తహసీల్లో తహసీల్దార్ డీఎస్ వెంకన్న, పోలీస్స్టేషన్లో ఏసీపీ తిరుమల్, సొసైటీ కార్యాలయంలో చైర్మన్ మారం రాము, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో సంపత్రెడ్డి, మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి శ్రీధర్, జీపీలో సర్పంచ్ సొంటిరెడ్డి యమున జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఎంపీడీవో సాహితీమిత్ర, ఎస్సై నాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సూరయ్య పాల్గొన్నారు.
దుగ్గొండి: ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కాట్ల కోమల, ఎంపీడీవో కృష్ణప్రసాద్, తహసీల్లో డీటీ సౌజన్య, పోలీస్స్టేషన్లో ఎస్సై రవికిరణ్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో దయాకర్, పీఏసీఎస్లో చైర్మన్లు మహిపాల్రెడ్డి, రాజేశ్వర్రావు, పైడి, గుడిపెల్లి శ్రీనివాస్రెడ్డి, సబ్స్టేషన్లో ఏఈలు సురేశ్, శ్రీధర్, ఎంఎస్ కార్యాలయంలో అధ్యక్షురాలు సాంబలక్ష్మి, ఏపీఎం రాజ్కుమార్, పీహెచ్సీల్లో వైద్యాధికారులు రాజు, స్వప్న, వెటర్నటీ వైద్యులు రామ్మోహన్, శారద, బాలాజీ, టీఆర్ఎస్ కార్యాలయంలో మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
ఆత్మకూరు: తహసీల్లో తహసీల్దార్ సురేశ్కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మార్క సుమలత, పోలీస్స్టేషన్లో సీఐ రంజిత్కుమార్, గూడెప్పాడ్ మార్కెట్లో చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, పీహెచ్సీలో వైద్యాధికారి రణధీర్, టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, పీఏసీఎస్లో చైర్మన్ ఏరుకొండ రవీందర్గౌడ్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా గూడెప్పాడ్ మార్కెట్లో రైతులను చైర్మన్ కేశవరెడ్డి సన్మానించి అన్నదాతలు, హమాలీలకు స్వీట్లు పంపిణీ చేశారు.
దామెర: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కాగితాల శంకర్, తహసీల్లో తహసీల్దార్ రియాజొద్దీన్ జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కృపాకర్రెడ్డి, సర్పంచ్ శ్రీరాంరెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, ఎంపీవో యాదగిరి, డాక్టర్ శిరీష పాల్గొన్నారు. కోగిల్వాయిలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గట్ల విష్ణువర్ధన్రెడ్డి జెండా ఆవిష్కరించారు.
ఎగిరిన మువ్వన్నెల జెండా
చెన్నారావుపేట: ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బదావత్ విజేందర్, పోలీస్స్టేషన్లో ఎస్సై శీలం రవి, చెన్నారావుపేట, అమీనాబాద్ సొసైటీల్లో చైర్మన్లు సత్యనారాయణరెడ్డి, రవి, టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, చెన్నారావుపేట జీపీలో సర్పంచ్ కుండె మల్లయ్య జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అలాగే, తహసీల్దార్ కార్యాలయంతోపాటు అన్ని సర్కారు ఆఫీసుల్లో ఆవిర్భావ వేడుకలు జరిగాయి. జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, ఎంపీడీవో లలిత, ఎంపీవో సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: ఎంపీపీ ఊడుగుల సునీత, తహసీల్దార్ సంపత్కుమార్, ఎస్సై బండారు వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు మహేందర్నాయక్, శశికుమార్ తమ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.
శాయంపేట: తహసీల్లో తహసీల్దార్ హరికృష్ణ, మండల పరిషత్లో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పోలీస్స్టేషన్లో ఎస్సై అకినపెల్లి ప్రవీణ్కుమార్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జీపీల్లో సర్పంచ్లు జెండాలను ఎగురవేశారు. ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, ఎంపీవో రంజిత్కుమార్, డీటీ భద్రునాయక్, ఆర్ఐ హేమానాయక్ పాల్గొన్నారు.
గీసుగొండ: తహసీల్లో తహసీల్దార్ సుహాసిని, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సౌజన్య, జిల్లా గ్రంథాలయంలో కార్యదర్శి శశిజాదేవి, పోలీస్స్ట్టేషన్లో సీఐ వెంకటేశ్వర్లుతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించి అమరవీరులను స్మరించుకున్నారు. ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ధనలక్ష్మి వేడుకలకు హాజరయ్యారు. అలాగే, గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లలో కార్పొరేటర్లు ఆకులపల్లి మనోహర్, సుంకరి మనీషాశివ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
సంగెం: తహసీల్లో తహసీల్దార్ బీ విశ్వనారాయణ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కళావతి, పోలీస్స్టేషన్లో ఎస్సై ఎం సురేశ్, జీపీలో సర్పంచ్ గుండేటి బాబు, పీహెచ్సీలో డాక్టర్ అశోక్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీకాంత్రెడ్డి, కేజీబీవీలో ప్రత్యేకాధికారి నీలిమ, గవిచర్ల మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ రెహమాన్, పశువైద్యశాలలో డాక్టర్ వీ రాజు, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం కిషన్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
నర్సంపేట రూరల్: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మోతె కళావతి, తహసీల్లో తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఆదర్శ మండల సమాఖ్యలో అధ్యక్షురాలు స్వేత, భాంజీపేట పీహెచ్సీలో వైద్యాధికారి భూపేశ్, మహేశ్వరం బాలుర గురుకుల విద్యాలయంలో ప్రత్యేకాధికారి మహ్మద్ ఇసాక్ అలీ, భాంజీపేట పశువైద్యశాలలో డాక్టర్ శ్రీధర్వర్మ, మహేశ్వరం సబ్స్టేషన్లో ఏఈ నవీన్కుమార్, నర్సంపేట, గురిజాల పీఏసీఎస్ల్లో చైర్మన్లు మోహన్రెడ్డి, రమేశ్గౌడ్ జాతీయ జెండాలను ఎగురవేశారు.
పరకాల: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డీఏవో రజిని, మున్సిపల్ కార్యాలయం, అమరధామంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ బొజ్జం రమేశ్, గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బొచ్చు వినయ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత, పోలీస్స్టేషన్లో సీఐ మహేందర్రెడ్డి, పరకాల, నడికూడ మండలాల్లోని జీపీల్లో సర్పంచ్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
రాయపర్తి: మండలకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, తహసీల్లో తహసీల్దార్ సత్యనారాయణ, పోలీస్స్టేషన్లో వర్ధన్నపేట ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, జీపీలో సర్పంచ్ గారె నర్సయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. జడ్పీటీసీ కుమారస్వామి, ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంపీవో రామ్మోహన్, ఏఈ కిరణ్కుమార్, ఏపీవో కుమార్గౌడ్ పాల్గొన్నారు.
పర్వతగిరి: తహసీల్లో తహసీల్దార్ మహబూబ్ అలీ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సంతోష్కుమార్, పోలీస్స్టేషన్లో సీఐ కిషన్, జీపీలో సర్పంచ్ చింతపట్ల మాలతి సోమేశ్వర్రావు, చింతనెక్కొండలో సర్పంచ్ గటిక సుష్మ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.