నేటి నుంచి ఖైదీల తరలింపు
పది బస్సుల ఏర్పాటు
చుట్టుపక్కల జైళ్లకు తరలింపు
ఏర్పాట్లు పూర్తి చేసిన జైళ్ల శాఖ
వరంగల్, మే 31(నమస్తే తెలంగాణ ప్రతి నిధి): వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్గా మార్చే ప్రక్రియకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలకు అనుగుణంగా ప్రస్తుత సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగు తున్నాయి. కొత్త దవాఖాన నిర్మాణానికి వీలుగా ఈ ఖైదీలను ఇతర జైళ్లకు మంగళవారం తరలించ నున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ హైద రాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జైళ్లకు పంపించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం పది బస్సులను ఏర్పాటు చేశారు. జైళ్ల శాఖ డీఐజీ వై రాజేశ్ ఈ మేరకు ఖైదీల తర లింపు వివరాలను మంగళవారం మధ్యాహ్నం ప్ర కటించనున్నారు. వరంగల్ సెంట్రల్ జైలులో ప్ర స్తుతం 958 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 897 మంది పురుషులు, 61 మంది మహిళలు ఉన్నారు. శిక్ష కాలం, నేరాల తీవ్రత ఆధారంగా వీరిని వివిధ జైళ్లకు పంపించనున్నారు. అధికారులు, సిబ్బంది కలిసి 250 మంది ఉన్నారు. వీరికి కూ డా ఆయా జైళ్లలో విధులు కేటాయించనున్నారు.
మామునూరు..
వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ర్మాణానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సెంట్రల్ జైలును మామునూరు ప్రాంతానికి తరలించాలని ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మం త్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అంతర్జాతీ య ప్రమాణాలు, కొత్త చట్టాలకు అనుగుణంగా సువిశాల విస్తీర్ణంలో వరంగల్ జైలును నిర్మించేలా ఏర్పాట్లు మొదలయ్యాయి. వరంగల్ సెంట్రల్ జైలు దాదాపు 73 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని కి 136 ఏండ్ల చరిత్ర ఉంది. ఎన్నో చారిత్రక సంఘటనలకు ఇది వేదికగా నిలిచింది. 1885లో వరంగల్ సెంట్రల్ జైలు ఏర్పాటైంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఖైదీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఖైదీల పరివర్తన కేంద్రంగా మార్చే దిశగా కార్యక్రమాలు అమలవు తున్నాయి. నిరంతరం న్యాయ సేవా కేంద్రాల సౌ కర్యం కల్పిస్తున్నారు. పేద ఖైదీల పిల్లల చదవులు, పెండ్లి కోసం ఖైదీల సంక్షేమ నిధి (పీ డబ్ల్యూఎఫ్) నుంచి రూ.50 వేల వరకు రుణాలు ఇస్తున్నారు.
ఉపాధి కేంద్రం..
వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీలకు ఉపాధి కేం ద్రంగానూ ఉంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ఖైదీలకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఖైదీలు వేత నంపై పనిచేసేలా స్టీల్, కార్పెంటరీ, డైయింగ్, వీ వింగ్, సబ్బులు, పినాయిల్, ప్రింటింగ్, డర్రీ, టై లరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. సెంట్రల్ జైలు ఇ ప్పుడు సెమీ ఓపెన్ ప్రిజన్గా అప్గ్రేడ్ అయ్యింది. రెండు పెట్రోలు బంకులు, నర్సరీ, వర్మీ కంపోస్టు యూనిట్లు ఉ న్నాయి. ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు వీటిలో పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమలకు సంబం ధించిన పరికరాలను, యంత్రాలను హైదరాబా ద్లోని చర్లపల్లి జైలుకు తరలించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.