నర్సంపేట రూరల్/రాయపర్తి/పర్వతగిరి, మే 21: గురిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శనివారం గ్రామ విద్యాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో యువశాస్త్రవేత్త దౌడు రాంబాబు, ప్రొఫెసర్ రమాణాచారి కమిటీ సభ్యులు గాదె సాంబయ్య, మెట్టు రమేశ్, ఆకారపు శ్రీనివాస్, దౌడు భాస్కర్, కొక్కు భాస్కర్, నీలం వెంకన్న, పత్రి కుమారస్వామి, ఉపాధ్యాయులు సామల భిక్షపతి, చంద్రమౌళి, స్వామినాథన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాయపర్తి మండలంలోని కొలన్పల్లి జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి విద్యార్థులకు కొలన్పల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు చిట్యాల వెంకటేశ్వర్లు పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. హెచ్ఎం లక్ష్మీనారాయణ, కుంట ప్రభాకర్ పాల్గొన్నారు. స్వేరోస్ ఇంటర్నేషనల్ పర్వతగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో చౌటపెల్లి ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం కరీంనగర్ సోషల్ వెల్ఫేర్ సీవోఈ కళాశాలలో సీటు సాధించిన విద్యార్థిని సుప్రియను సత్కరించి, చౌటపెల్లి ఉపాధ్యాయులు రూ. 4,500 ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గారె జయరాజ్, హెచ్ఎం, మండల నోడల్ అధికారి గాయపు లింగారెడ్డి, సర్పంచ్ గౌరారపు ఉమ రాజు, ఎంపీటీసీ మిట్టపెల్లి లావణ్య, ఎస్ఎంసీ చైర్మన్ శెట్టి సోమయ్య, సొసైటీ డైరెక్టర్ మిట్టపెల్లి గోపాల్రావు, రమేశ్కుమార్, రంజిత్, కాసర్ల రాజు, బూక్యా ప్రవీణ్, బానోత్ రమేశ్, చిన్నపెల్లి రాజు, చందు పాల్గొన్నారు.