హనుమకొండ, అక్టోబర్ 7: అర్హులైన ప్రతి ఒకరికీ పోడు భూముల పట్టాలు అందించే ప్రక్రి యను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీ వ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో ఫారెస్ట్, రెవెన్యూ , పంచాయతీ, గిరిజన శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూములకు సంబం ధించిన ఆన్లైన్ దరఖాస్తులను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేసి పరిషరించాలన్నారు. పోడు భూములను పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంద న్నారు. అటవీ సంపదను కాపాడుకోవడంతోపా టు, భవిష్యత్లో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల న్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసు కుంటున్న వారికి న్యాయం చేస్తూనే ఇక మీదట అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా అరిక ట్టేందుకు అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సమ న్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ భూముల సమస్యలను పరిషరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సులభతరమైన ప్రత్యేక యాప్ ను రూపొందిచిందన్నారు.
శాయంపేట మండ లంలో ఐదు గ్రామ పంచాయతీలైన కాట్రపల్లి, గంగిరేణిగూడెం, సాధనపల్లి, నూర్జహాన్పల్లి, సూ ర్యనాయక్ తండాలను ఆవాసిత ప్రాంతాలను గుర్తించి కమిటీలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 777 క్లెయిమ్స్ ఆన్లైన్లో వచ్చాయని పేర్కొన్నారు. పోడు చేసుకున్న వారి సమగ్ర వివ రాలు, భూముల కొలతల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ యాప్ ప్రాంతాల వారీగా డేటా, ఫారెస్ట్ డేటా ఒకే విధంగా ఉండాలని పేర్కొన్నా రు. యాప్లో నిర్దేశించిన సమయంలోగా న మో దు చేయాలని సూచించారు. ఈ యాప్ వినియో గంపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా పంచాయతీ కార్యదర్శులకు అధికారులు అవగాహన కల్పించా రు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యా రాణి, డీఆర్ఓ ఎం వాసుచంద్ర, సర్వే ల్యాండ్ ఏడీ ప్రభాకర్, డీపీఓ జగదీశ్, జిల్లా ట్రైబల్ వెల్ఫే ర్ ఆఫీసర్ ప్రమీల, ఎఫ్ఆర్ఓలు, సదానందం, భిక్షపతి, రెవెన్యూ, ఫారెస్ట్, సర్వే ల్యాండ్, పంచా యతీ రాజ్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.