హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 2: వరంగల్ వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 7 వరకు జరగనున్న అంతర్ జిల్లాల మహిళా టీ-20 క్రికెట్ పోటీల్లో వరంగల్ జట్టు మెదక్ జట్టుపై 56 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి శుభారంభం చేసిందని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూడీసీఏ) కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. వంగాలపల్లిలోని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. వరంగల్ ఓపెనర్ సాయి ధృవిగ్య్న 56 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో 62 పరుగులు చేసి అజేయంగా నిలించింది.
దీంతో 114 పరుగుల లక్ష చేధనలో బరిలోకి దిగిన మెదక్ జట్టు కేవలం 12.4 ఓవర్లు ఎదుర్కొని 57 పరుగులకే ఆలౌట్ కావడంతో 56 పరుగులు తేడాతో ఓటమి మూటకట్టుకుంది. వరంగల్ జట్టులో బ్యాటింగ్ లో రాణించడమే కాకుండా బౌలింగ్లో సైతం 2 వికెట్లు తీసి వరంగల్ జట్టును ఒంటి చేత్తో గెలిపించింది సాయి ధృవిగ్య్న. వరంగల్లోని మొగిలిచర్ల గ్రౌండ్లో జరిగిన మరో మ్యాచ్లో నిజామాబాద్ జట్టుపై ఖమ్మం జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. నిజామాబాద్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేయగా ఖమ్మం జట్టులోని ఓపెనర్స్ ఇద్దరు నాటౌట్గా యశ్వేశ్విని 37 పరుగులు, వైష్ణవి 48 పరుగులు చేసి కేవలం 16.1 ఓవర్లలోనే 103 పరుగులు సాధించి విజేతగా నిలిచిందని శ్రీనివాస్ తెలిపారు.

ఖమ్మం జట్టు..