హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్రంలో బేడబుడగ జంగం సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని బేడబుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బేడబుడగ జంగం సమాజాన్ని మాల, మాదిగలతో కలపకుండా ప్రత్యేక ఉపవర్గంగా గుర్తిచాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమాన్ని ముందుకు నడిపామని గుర్తుచేశారు.
రాష్ట్ర మంత్రులను పలుమార్లు కలిసి వినతులు సమర్పించి బేడబుడగ జంగం సమాజానికి ప్రత్యేక గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు సిరిగిరి జంపయ్య, కత్తి మల్లయ్య, సిరుపాటి సారంగపాణి, మోతె నర్సయ్య, చింతల జంపయ్య, నిడిగొండ రమేశ్, ఉబది సారంగం, గందం రాజు, పాస్తాం వీరస్వామి, సమ్మయ్య, తూర్పాటి అనిల్ పాల్గొన్నారు.