చిట్యాల : గ్రామ దేవతల అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలతో తలతూగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామదేవతల ప్రతిష్ఠాపన వేడుకలకు వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతితో కలిసి హాజరయ్యారు. ప్రతిష్ఠాపించిన భూదేవి, లక్ష్మి సమేత నాబిశిల బొడ్రాయి, పోచమ్మతల్లి విగ్రహాలకు గండ్ర దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామదేతల అశీస్సులు ఎల్లవేళల గ్రామంపై ఉండి పాడిపంటలు, పశుసంపద పెంపొంది ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
గ్రామంలో పూర్తి స్థాయిలో నిర్మించబోతున్న ఆంజనేయస్వామి ఆలయానికి తమ వంతుగా కృషి చేస్తామని గండ్ర దంపతులు గ్రామస్తుల సమక్షంలో హామీ ఇచ్చారు. దేవాతాముర్తుల పేరు మీదుగా అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి, జడ్పీటీసీ గొరెసాగర్, స్థానిక సర్పంచ్ ఏలేటి సరోజనలింగారెడ్డి, ఎంపీటీసీ కట్కూరి పద్మ, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆరెపెల్లి మల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, సర్పంచ్ పూర్ణ చందర్రావు, కో-ఆప్షన్ మెంబర్ రాజమహ్మద్, నాయకులు, నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.