కరీమాబాద్, జనవరి 12: స్వామి వివేకానంద జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో కరీమాబాద్లోని తోట్లవాడలో మాజీ కార్పొరేటర్ మేడిది రజిత-మధుసూదన్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివేకానందుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించి మాట్లాడారు.
యువత వివేకానందుడి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే, 43వ డివిజన్ శ్రీసాయినగర్కాలనీలో వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వివేకానందుడి స్ఫూర్తి పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బొల్లోజు కృష్ణమూర్తి, బోళ్ల అశోక్, మెంతుల వెంకటేశ్వర్లు, పొడిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని పలు విద్యాలయాల్లో వివేకానంద జయంతి నిర్వహించారు.
వాడవాడలా వేడుకలు
ఖానాపురం/నర్సంపేట/దుగ్గొండి: ఖానాపురం మండలం ధర్మరావుపేటలో శ్రీచైతన్య యూత్ ఆధ్వర్యంలో సర్పంచ్ వెన్ను శ్రుతి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఖానాపురం ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం దూళం రాజేందర్, కొత్తూరులో సర్పంచ్ బూస రమ, జనతా యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి జరిగింది. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కత్తాల వెంకటేశ్వర్రావు, ఐలయ్య, పూర్ణచందర్, డానియెల్ పాల్, ప్రశాంత్, బూస అశోక్, కార్యదర్శి స్రవంతి, రామ్మోహన్రావు, నాయుడు, సుబ్బారావు పాల్గొన్నారు.
నర్సంపేటలోని సిద్ధార్థ పీజీ కళాశాలలో వివేకానందుడి చిత్రపటానికి ప్రిన్సిపాల్ గోగుల ప్రభాకర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కొఆర్డినేటర్ పెండెం రాజేశ్,అధ్యాపకులు శంకర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గొండిలో యూత్ ఫర్ స్వచ్ఛ్ దుగ్గొండి ఆధ్వర్యంలో నిర్వహించిన వివేకానంద జయంతిలో అధ్యక్షుడు శానబోయిన రాజ్కుమార్ పాల్గొని వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తిమ్మంపేట సర్పంచ్ మోడెం విద్యాసాగర్గౌడ్, దుగ్గొండి ఉపసర్పంచ్ యాదగిరి సుధాకర్, సభ్యులు కొల్లూరి మోహన్రావు, పొగాకు బాలకృష్ణ, కక్కెర్ల ప్రమోద్, కందిపెల్లి శంకర్, మాలగాని రమేశ్, పాలకుర్తి వంశీ, కోట రాజు పాల్గొన్నారు.
వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి
వర్ధన్నపేట/నల్లబెల్లి/నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/గీసుగొండ: యువత స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాని వక్తలు సూచించారు. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద, వర్ధన్నపేట ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న వివేకానంద విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, యువకులు పాల్గొన్నారు. నల్లబెల్లిలోని స్వామి వివేకానందుడి విగ్రహానికి దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, ఎమ్మార్పీఎస్ నాయకుడు పరికి రత్నం పూలమాల వేశారు.
నర్సంపేట మండలంలోని ముగ్దుంపురం జయముఖి ఇంజినీరింగ్ కళాశాల, బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో వివేకానంద జయంతి నిర్వహించారు. చెన్నారావుపేట బస్టాండ్ సెంటర్లో సర్పంచ్ కుండె మల్లయ్య, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాగృతి విద్యానికేతన్ విద్యార్థులు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ 16వ డివిజన్ ధర్మారం ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో దూరవిద్య కో ఆర్డినేటర్ శ్రీకాంత్ వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు శ్రీకాంత్, అఖిల్, నవీన్, శివ, సాయి పాల్గొన్నారు.
నగరంలో ఘనంగా వేడుకలు
గిర్మాజీపేట/వరంగల్/కాశీబుగ్గ: వివేకానందుడి జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని ట్రాఫిక్ సీఐ బాబూలాల్ అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా పాపయ్యపేట చమన్ వద్ద రాయబారపు వినోద్ఆనంద్ తన తండ్రి వెంకటేశ్వర్లు జ్ఞానకార్థం 725 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత ఆకుతోట శిరీష్, లయన్ డాక్టర్ రాంరెడ్డి, జడ్సీ లయన్ కే సుభాష్, లయన్ జీ సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఏవీవీ కళాశాల ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాసరావు, వలంటీర్లు నిశ్చల, మృదిని, సుమశ్రీ, రియాజ్, శశాంక్, కార్తికేయ, సాకేత్, ఆదిత్య, అశోక్, ప్రవీణ్ పాల్గొన్నారు. 19వ డివిజన్ వివేకానందకాలనీలో వరంగల్ ఏసీపీ కలకోట గిరికుమార్, ఇంతేజార్గంజ్ సీఐ మల్లేశ్యాదవ్ వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
వివేకానందుడి స్ఫూర్తిగా ముందుకు సాగాలి : మంత్రి
పర్వతగిరి: ప్రతి ఒక్కరూ వివేకానంద స్ఫూర్తిగా ముందుకు సాగాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని లయోలా ఉన్నత పాఠశాలలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామి వివేకానంద చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోటీల్లో విజేతలైన విద్యార్థలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చింతపట్ల సోమేశ్వర్రావు, స్కూల్ యాజమాన్యం చంపక వల్లీ, సేవా సమితి ప్రతినిధి సీహెచ్ చంద్రశేఖర్, చిదిరాల వేణుగోపాల్ పాల్గొన్నారు.