హనుమకొండ చౌరస్తా, మే 26: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్ ఐసెట్-2023 ఆన్లైన్ ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగింది. తొలి రోజు శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి, ఐసెట్ చైర్మన్, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య తాటికొండ రమేశ్ పరీక్ష పత్రం సెట్ను, పాస్వర్డ్ను రిజిస్ట్రార్ ఆచార్య టీ శ్రీనివాస్రావు, కన్వీనర్ ఆచార్య పీ వరలక్ష్మి సమక్షంలో విడుదల చేశారు.
రెండు సెషన్లలో తెలంగాణ, అంధ్రప్రదేశ్లోని ఎంపిక చేసిన 20 ప్రాంతీయ కేంద్రాల్లో 37,968 మంది విద్యార్థులు ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 35,273 మంది పరీక్షకు హాజరయ్యారని వారు పేర్కొన్నారు. మొత్తం 93 శాతం మంది హాజరు హాజరుకాగా, మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు కన్వీనర్ ఆచార్య వరలక్ష్మి తెలిపారు.