కాశీబుగ్గ, జనవరి 6 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం కొత్త మిర్చి ధర రికార్డు స్థాయిలో పలికింది. ఈ సీజన్లో అత్యధికంగా క్వింటాళ్లు దేశిరకం మిర్చికి ధర రూ.80వేల 100 ధర పలికింది. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని రావిచెట్టు తండాకి చెందిన తేజవత్ రాములు 04 బస్తాల మిర్చిని మార్కెట్కు తీసుకువచ్చారు. మిర్చి గత సీజన్లో అత్యధికంగా క్వింటాళ్లుకు రూ.96వేలు పలికింది. ఈ సీజన్ డిసెంబర్ నుంచి ప్రారంభంగా కాగా అత్యధికంగా శుక్రవారం ధరలు పలికాయి. అన్నపూర్ణ ట్రేడర్స్ అడ్తి ద్వారా శ్రీ చైత్ర ఎంటర్ప్రైజెస్ కరీదు వ్యాపారి అత్యధికంగా క్వింటాళ్లుకు రూ.80వేల 100తో కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
సీజన్ ప్రారంభంలోనే దేశిరకం మిర్చికి అత్యధికంగా ధరలు పలకడంతో రైతులు సంతోశం వ్యక్తం చేసారు. నాణ్యతగల మిర్చిని మార్కెట్కు తీసుకువస్తే గిట్టుబాటు ధరలు పొందవచ్చని కార్యదర్శి బరుపాటి వెంకటేష్రాహుల్ తెలిపారు.