వరంగల్ : జిల్లాలోని గీసుగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, సభ్యురాలు భారతి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆహారం, అంగన్వాడీల ద్వారా తల్లులకు, పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగాలని సూచించారు.