మందమర్రి రూరల్, జనవరి 5: బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ దేశంలోనే ఘన కీర్తిని సాధించిందని, అదే విధంగా ఆటల్లోనూ కోలిండియాలో క్రీడాకారులు సత్తా చాటాలని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో సింగరేణి స్థాయి లాన్ టెన్నిస్, బాస్కె ట్ బాల్ పోటీలు గురువారం ఘనంగా ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా జీఎం క్రీడా పతకాన్ని ఆవిష్కరించారు. క్రీడాకారుల ను పరిచయం చేసుకున్నారు.
అనంతరం ఆ యన మాట్లాడారు. సింగరేణి సంస్థ ఎప్పుడూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తుందని తెలిపారు. ప్రతి సింగరేణి క్రీడాకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ ఏరియాల నుంచి 150 మంది క్రీడాకారులు వచ్చారని, వారికి అన్ని వసతులు కల్పించామని చెప్పారు. క్రీడలు స్నేహ భావాన్ని, శారీరక, మానసిక దృఢత్వా న్ని పెంపొందిస్తాయన్నారు. రెండు రోజులు జరిగే ఈ పోటీల్లో గెలుపు ఓటములు పక్కన పెట్టి క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని సూచించా రు.
ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం కృ ష్ణారావు, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి స లేంద్ర సత్యనారాయణ, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, సీఎంవోఏఐ అధ్యక్షుడు మధుసూదన్, పర్సనల్ డిపార్ట్మెంట్ హెచ్వోడీ శ్యామ్ సుందర్, సీనియర్ పీవో మైత్రేయ బంధు, స్పోర్ట్స్ సూపర్వైజర్లు సుందర్రాజు, అశోక్, జాన్వెస్లీ, శ్రీనివాస్, రమేశ్, మందమర్రి స్పోర్ట్స్ గౌరవ కార్యదర్శి సంఘమిత్ర, కో ఆర్డినేటర్ చిన్నయ్య, గ్రౌండ్ ఇన్చార్జి నస్పూరి తిరుపతి, యూనియన్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
సింగరేణిలో ఉద్యోగం చేస్తూ క్రీడల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. నేను లాన్ టెన్నిస్ ఆడతా. ఇప్పటివరకు ఏడు సార్లు కోలిండియా స్థాయిలో పాల్గొన్నా. ఒక్కసారి మా టీంకు చాంపియన్ షిప్ లభించింది. అంతే కాకుండా 5 సార్లు లాన్ టెన్నిస్ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్లే అవకాశం దక్కింది. 20 యేండ్లుగా సింగరేణిలో పని చేస్తున్నా. నేను ఈ క్రీడాభివృద్ధి కోసం పాటుపడుతా. ప్రాక్టీస్కు మరింత మెరుగులు దిద్దుకొని సింగరేణికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు కృషి చేస్తా. మందమర్రి ఏరియాలో క్రీడాకారుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జీఎం చింతల శ్రీనివాస్కు క్రీడాకారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– ముదాం కిషన్, శాంతిఖని మ్యాన్ వైడింగ్ ఆపరేటర్, మందమర్రి ఏరియా
సింగరేణి ప్రోత్సాహంతో మరింత గుర్తింపు తెచ్చుకుంటా. నేను ఉద్యోగం పొందినప్పటి నుంచి బాస్కెట్ బాల్ క్రీడలో పాల్గొంటున్నా. కానీ ఈ క్రీడ సింగరేణి స్థాయి వరకే ఉంది. కోలిండియాలో కూడా ఈ ఆటను ప్రవేశ పెట్టాలని కార్మిక సంఘ నాయకులను కోరాం. వినతిపత్రం కూడా ఇచ్చాం. ఎంతో కష్టపడి ఆటలో నైపుణ్యం పెంచుకుంటే అది సింగరేణి స్థాయికే పరిమితం అవుతుంది. బాస్కెట్ బాల్లో కోలిండియాలో కూడా బహుమతులు సాధించే క్రీడాకారులు సింగరేణిలో ఉన్నారు. ఒక క్రీడాకారుడిగా గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. మందమర్రిలో జరిగే ఈ పోటీలకు యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంది.
-కలువల ప్రశాంత్, ఆర్జీ-2, 7 ఎల్పీ, జనరల్ మజ్దూర్