నర్సంపేట రూరల్, జూలై5: ప్రేమ వివాహం.. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అబ్బాయితో పాటు సహరించిన ముగ్గురు స్నేహితుల ఇండ్లను అమ్మాయి తరఫు బంధు వులు నిప్పంటించిన ఘటన నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని కి చెందిన మండల రవీందర్ కూతురు కావ్యశ్రీ ఇదే గ్రా మానికి చెందిన జాలిగం శ్రీనివాస్ కుమారుడు రంజిత్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మా యి తల్లిదండ్రులకు తెలవడంతో ఆమెను మందలించా రు.
ఇదిలా ఉండగా కావ్యశ్రీని తల్లిదండ్రులు హనుమ కొండ జిల్లా హసన్పర్తిలోని ఓ కాలేజీలో బీటెక్ చదివిస్తు న్నారు. గత నెల 30న ఆమె కాలేజీ హాస్టల్ నుంచి బయ టకు వచ్చి రంజిత్తో కలిసి హైదరాబాద్ వెళ్లింది. దీంతో అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో వెతికి చివరకు హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న చిలుకూరు బాలాజీ ఆలయంలో కావ్యశ్రీ-రంజిత్(మేజర్లు) ప్రేమ వివాహం చేసుకున్నారు. అదేరో జు రాత్రి హసన్పర్తి పోలీసులకు లొంగిపోయి రక్షణ కల్పించాలని కోరారు. దీంతో వారు ఇద్దరి తల్లిదండ్రుల సమక్షంలో ప్రేమ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అమ్మాయికి నచ్చజెప్పినా వినకుండా రంజిత్తో కలిసి వెళ్లిపోయింది.
అర్ధరాత్రి కావ్యశ్రీ తరఫు బంధువులు కొంత మంది బైక్లపై పెట్రోల్ క్యాన్తో జాలిగం రంజిత్ ఇంటికి వెళ్లగా, అక్కడ వారెవరూ లేకపోవడంతో ఫర్నిచ ర్ను ధ్వంసం చేసి ఆతర్వాత నిప్పంటించారు. అక్కడి నుండి రంజిత్కు సహకరించిన స్నేహితులు సామల రాకేశ్, బొడ్డుపల్లి విజయ్, బూస ప్రవీణ్ ఇండ్లపైకి దాడి చేసి ఆయా ఇండ్లను కూడా ధ్వంసం చేసి నిప్పంటించా రు. దీంతో ఆయా ఇళ్లల్లో ఉన్న వస్తువులు, ఫర్నిచర్ పూర్తి గా కాలిపోయింది. ఆ సమయంలో ఆయా ఇళ్లల్లో మను షులు ఎవరూ లేరు. ప్రధాన రహదారిపై ఉన్న అబ్బాయి తండ్రికి చెందిన మిర్చి బండికి కూడా నిప్పంటించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని నర్సంపే ట ఏసీపీ సంపత్రావు, టౌన్ సీఐ పులి రమేశ్గౌడ్, ఎస్సై లు బొజ్జ రవీందర్, సురేశ్, మహేందర్ పరిశీలించారు. స్థానికులను విచారించారు. ఇటుకాలపల్లిలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నలుగురి ఇండ్లను తగులబెట్టిన నిందితులపై కేసు నమోదు చేసినట్లు నర్సంపేట ఏసీపీ సంపత్రావు తెలిపా రు. బాధితుల ఫిర్యాదు మేరకు 10 మందిపై కేసు నమో దు చేసి విచారణ చేపడుతున్నామన్నారు.