కాజీపేట, అక్టోబర్ 31: కాజీపేట రైల్వే జంక్షన్లో ప్లాట్ఫాంపై మంగళవారం ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేసి పధ్నాలుగున్నర కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సై జ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైల్వే జంక్షన్లో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా అనుమానాసదంగా ఓ వ్యక్తి బ్యాగుతో కనిపించాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని తనిఖీ చేయగా పధ్నాలుగున్నర కిలోల గంజాయి బయట పడింది. నిందితుడిని విచారించగా ఉత్తరప్రదేశ్కు చెందిన తన పేరు రాధే శ్యాం అని, అధిక డబ్బులకు ఆశ పడి కొంతకాలంగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. గుర్తు తెలియ ని వ్యక్తి విజయవాడలో బ్యాగును అప్పగించి ఖరగ్పూర్లో అప్పగించాలని చెప్పాడని పేర్కొన్నాడు. కాజీపేట లో రాత్రి దిగి ఖరగ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు కోసం వేచి ఉన్న ట్లు చెప్పాడు. నిందితుడిపై మాదక ద్రవ్యాల రవాణా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఇన్స్పెక్టర్ చెప్పారు. ఈ తనిఖీల్లో కాజీపేట ఎక్సైజ్ ఎస్సై లు తిరుపతి, సౌమ్య, హెడ్ కానిస్టేబుళ్లు ఖలీల్, కోటిలింగం, వీరమల్లు, రషీద్, లాలయ్య, వెంకటరమణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ చౌరస్తా: జనగామ రైల్వే స్టేషన్ వద్ద మంగళ వారం నిర్వహించిన తనిఖీల్లో పది కిలోల ఎండు గంజాయి పార్సిల్ను తరలిస్తూ బీహార్కు చెందిన శంకర్కు మార్ యాదవ్ పట్టుబడినట్లు ఎక్సైజ్ సీఐ బీ ప్రభావతి తెలిపారు. నిందితుడిని జిల్లా కోర్టు లో హాజరుపర్చి రిమాండ్కు తరలిం చినట్లు పేర్కొన్నారు. పట్టుకున్న గం జాయి విలువ సుమారు రూ. 2.50 లక్షల వరకు ఉంటుందన్నారు. తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్సైలు సీహెచ్ జనార్దన్, రాధిక, సిబ్బంది ఖలీల్, శ్రావణ్, సోమేశ్వర్ పాల్గొన్నారు.
ఏటూరునాగారం: మండలంలోని దొడ్ల కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ రాజు, ఎస్సై కృష్ణ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. మంగళవారం ఏటూరునాగారంలోని అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా బైక్ వస్తున్న భూ క్యా మహేశ్, ఇస్లావత్ లక్ష్మణ్ వద్ద రెండు, మూడు కేజీల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. విచారించగా గంజాయిని విక్రయించేందుకు ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఇద్దరిపై కేసు నమో దు చేయడంతోపాటు బైక్ను సీజ్ చేసినట్లు సీఐ, ఎస్సైలు తెలిపారు.