మహబూబాబాద్ జూలై, 25 (నమస్తే తెలంగాణ): మరో రాష్ట్రస్థాయి పదవి జిల్లాను వరించింది. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి మనువరాలు దీపికారెడ్డిని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నియమించారు. మాజీ మంత్రి నూకల రామచంద్రరెడ్డి పెద్ద కూతురు రాధికారెడ్డి కూతురు దీపికారెడ్డి. దీపికారెడ్డి బాల్యమంతా మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లిలోనే గడిచింది.
కాగా, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత దీపికారెడ్డిని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్గా నియమించిన సీఎం కేసీఆర్కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి దీపికారెడ్డితో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మానుకోట మనువరాలికి రాష్ట్ర స్థాయి పదవి దక్కడంతో జమాండ్లపల్లి గ్రామవాసులు ఆనందం వ్యక్తం చేశారు.