కాశీబుగ్గ, ఫిబ్రవరి 28: గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్లో కాకతీయులు నిర్మించిన రంగనాథస్వామి ఆలయంలోని స్వామివారి విగ్రహంపై మంగళవారం ఉదయం సూర్యకిరణాలు పడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యే క పూజలు, అభిషేకాలు చేశారు.
ప్రతి మాఘమాసంలో సూర్యకిరణాలు రంగనాథస్వామిపై పడటం విశేషమని తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వంగరి రవి, కార్యదర్శి చిలుపూరి సురేశ్, సుల్తానా, సమ్మక్క, అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, వంగరి సమ్మయ్య, రాగుల ప్రసాద్, గడ్డం భాస్కర్, కూరపాటి రవికుమార్ పాల్గొన్నారు.