గిర్మాజీపేట, మే 10: ఎస్సెస్సీ ఫలితాల్లో 89.61 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో జిల్లా 16వ స్థానం సాధించిందని డీఈవో డీ వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9710 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 8701 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 88.89, బాలికలు 90.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 69 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇద్దరు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 21, టీఎస్ రెసిడెన్షియల్లో ఒకరు, టీఎస్డబ్ల్యూఆర్ఎస్లో ఇద్దరు, ప్రైవేట్ పాఠశాలల్లో 43 మంది కలిపి మొత్తం 61 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారన్నారు. పది ఫలితాల్లో అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ. 1000 చలానా రూపంలో 15 రోజుల్లో చెల్లించాలని డీఈవో సూచించారు. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 26లోగా పరీక్ష ఫీజును పాఠశాలల్లో చెల్లించాలని కోరారు.
కోటలో 82 శాతం ఉత్తీర్ణత
ఖిలావరంగల్/గిర్మాజీపేట: మధ్యకోటలోని ఆరెళ్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 24, బాలికలు 25 మంది పరీక్షలు రాయగా, 9 మంది ఫెయిల్ అయ్యారు. కుర్రేముల సాత్విక 9.7 జీపీఏ సాధించి మండలంలో టాపర్గా నిలిచింది. అలాగే, మధ్యకోటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 35 మందికి 31 మంది ఉత్తీర్ణులయ్యారు. హజిర 9.5 జీపీఏ సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బీ దామోదర్యాదవ్ విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. అలాగే, శివనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 78.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. 9.2 జీపీఏతో ఎస్ రక్షిత స్కూల్ టాపర్గా నిలిచింది. అలాగే, కృష్ణాకాలనీ హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటి 86 శాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం గంపా అశోక్కుమార్ తెలిపారు. 9.8 జీపీఏ సాధించిన కే రితిక, పీ సాయివైష్ణవి, కే శ్రీజను సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ 9.7 జీపీఏ ముగ్గురు, 9.5 ఒక్కరు, 9.2 నలుగురు, 9 జీపీఏ ఒకరు సాధించారని తెలిపారు.
ప్రైవేట్కు దీటుగా ఫలితాలు
నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/నెక్కొండ/ఖానాపురం, మే 10: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. నర్సంపేట మండలంలో 94.76 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇన్చార్జి ఎంఈవో రత్నమాల తెలిపారు. మండలంలో బాలురు 595 మంది, బాలికలు 381 మంది కలిపి మొత్తం 976 మంది విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. గురిజాల జడ్పీహెచ్ఎస్కు చెందిన ఎస్ సాయికృష్ణ 9.7 జీపీఏ, కమ్మపల్లి జడ్పీహెచ్ఎస్కు చెందిన జీ సాత్విక 9.7 జీపీఏ, ఇటుకాలపల్లి హైస్కూల్కు చెందిన ఎస్ అక్షయ్ 9.7 జీపీఏ, మైనార్టీ గురుకుల విద్యాలయానికి చెందిన ఎల్ నందిని 9.7 జీపీఏ సాధించారు.
చెన్నారావుపేట మండలంలో 339 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 316 మంది ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో రత్నమాల తెలిపారు. కేజీబీవీలో 92 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కాసాని గణేశ్, అశ్విత, బ్రాహ్మణి, ప్రేమ్సింగ్, సందీప్, వర్షిత 9.7 జీపీఏ సాధించారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో నెక్కొండలోని రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాల, పెద్దకోర్పోలు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో రత్నమాల తెలిపారు. నెక్కొండలో తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులంలో 83 మంది, పెద్దకోర్పోలు జడ్పీహెచ్ఎస్లో 8 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. మండలంలో మొత్తం 613 మందికి 555 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
అంధ విద్యార్థుల ప్రతిభ
పోచమ్మమైదాన్/కాశీబుగ్గ: పదో తరగతి పరీక్షల్లో వరంగల్ ఆటోనగర్లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆదర్శ అంధుల పాఠశాలకు చెందిన బండి కీర్తిచందన, పేర్ల నాగరాజు, దిడ్డి దేవేందర్ మాసూం అలీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. కీర్తి చందన 8.2, పేర్ల నాగరాజు 7.6, దిడ్డి దేవేందర్ 7.2 జీపీఏ సాధించారు. ఆదర్శ పాఠశాల నుంచి పరీక్ష రాసిన ముగ్గురు విద్యార్థులూ పాస్ కావడంతో నిర్వాహకురాలు నలివెల కల్యాణి, ఉపాధ్యాయులు పిల్లలను అభినందించారు. అలాగే, కాశీబుగ్గ ప్రాంతంలోని ప్రభుత్వ నరేంద్రనగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. పాఠశాల నుంచి 87 మంది బాలురు, 78 మంది బాలికలు కలిపి మొత్తం 165 మంది టెన్త్ పరీక్షలు రాసినట్లు హెచ్ఎం కుంట రవికుమార్ తెలిపారు. అందులో బాలురు 66, బాలికలు 58 కలిపి మొత్తం 124 మంది ఉతీర్ణులైనట్లు చెప్పారు. సీహెచ్ కార్తీక్ 9.8 జీపీఏ సాధించాడని, మరో 20 మంది 9 పైగా జీపీఏ సాధించారని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల హవా
ఖానాపురం మండలంలోని 8 జడ్పీహెచ్ఎస్లు, అశోక్నగర్ కేజీబీవీ, ఐనపల్లి జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాల, బుధరావుపేట మోడల్స్కూల్కు చెందిన 345 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా, 315 మంది విద్యార్థులు(84.26 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఖానాపురం జడ్పీహెచ్ఎస్ 96.55 శాతం, అశోక్నగర్ జడ్పీహెచ్ఎస్-87.18, బుధరావుపేట జడ్పీహెచ్ఎస్-86.21, దబ్బీర్పేట జడ్పీహెచ్ఎస్-50, మంగళవారిపేట జడ్పీహెచ్ఎస్-80 శాతం, ధర్మారావుపేట జడ్పీహెచ్ఎస్ 50, కొత్తూరు జడ్పీహెచ్ఎస్ 94.44, మనుబోతులగడ్డ జిల్లా పరిషత్ పాఠశాల 100 శాతం, అశోక్నగర్ కేజీబీవీ 89.19 శాతం, బుధరావుపేట మోడల్స్కూల్ 94.59 శాతం, ఐనపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో 98.72 శాతం, మనుబోతులగడ్డ పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. బుధరావుపేట మోడల్స్కూల్కు చెందిన కే సౌమ్య 9.8, ఐనపల్లి జ్యోతిబా ఫూలే పాఠశాల నుంచి జీ అమ్ములు 9.8, కే శ్రీజ 9.8, ఎం రుచిత 9.8 జీపీఏ సాధించారు.
‘పది’లో ‘సర్కారు’ హవా
నల్లబెల్లి/ రాయపర్తి: ఎస్సెస్సీ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హవా కొనసాగించారు. మండలంలో 391 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 373 మంది ఉత్తీర్ణులయ్యారు. మూడుచెక్కలపల్లె గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని బానోత్ కవిత, రాయపురం పూజ 9.8 జీపీఏ సాధించారు. మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు నవ్య, సిరిమల్లె ఉత్తమ ఫలితాలు సాధించారు. రాయపర్తి మండలంలో 88.96 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఇన్చార్జి ఎంఈవో నోముల రంగయ్య తెలిపారు. మండలంలో 453 మంది పరీక్షలు రాయగా, 403 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వివరించారు. మండలకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన జీ నవ్యశ్రీ 9.7 జీపీఏతో మండల టాపర్గా నిలిచింది. పెర్కవేడు జడ్పీహెచ్ఎస్కు చెందిన కొండ హాసిని 9.5 జీపీఏ సాధించింది. తిర్మలాయపల్లి కేజీబీవీకి చెందిన టీ దివ్య 9.2 జీపీఏ సాధించింది. ఆశ్రమ పాఠశాలకు చెందిన 36 మంది విద్యార్థినులకు 31 మంది ఉత్తీర్ణులైనట్లు స్పెషల్ ఆఫీసర్ బుర్రా కవిత తెలిపారు.
సర్కారు బడుల్లో ఉత్తమ ఫలితాలు..
గీసుగొండ/సంగెం/ఖిలావరంగల్/పర్వతగిరి/రాయపర్తి: గీసుగొండ మండలంలోని 21 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 563 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 531 మంది ఉత్తీర్ణత సాధించారు. మండలంలో 94 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఎంఈవో సత్యనారాయణ తెలిపారు. మచ్చాపురం, ఎలుకుర్తి, మొగిలిచర్ల ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. వంచనగిరి మోడల్ స్కూల్ విద్యార్థి శివగణేశ్ 9.7 జీపీఏతో మండల టాపర్గా నిలిచాడు. గంగదేవిపల్లి పాఠశాలలో చదివిన విద్యార్థి బానోత్ భరత్ 9.5 జీపీఏ సాధించాడు. సంగెం మండలంలో 92.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో ఎన్ విజయ్కుమార్ తెలిపారు. గవిచర్ల మోడల్ స్కూల్ విద్యార్థులు కొండపర్తి అమూల్య, అడ్డగట్ల హాసిని, దడిగెల తరుణికుమారి 9.8 జీపీఏ సాధించినట్లు ప్రిన్సిపాల్ ముజుబుర్ రహమాన్ తెలిపారు. లడే హాసిని 9.7, ననుమాస అక్షిత 9.5, మేరుగు మీనాక్షి, చెన్నూరి శ్రీచందన, ముస్కు రసజ్ఞ 9.3 జీపీఏ సాధించారు. మండలంలో 347 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదు.
సంగెం కేజీబీవీలో యాట స్పందన 8.7 జీపీఏ సాధించి స్కూల్ టాపర్గా నిలిచినట్లు ఎస్వో నీలిమ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 79 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 11 మంది బాలురకు 8 మంది, 13 మంది బాలికలకు ఏడుగురు పాసయ్యారు. ఇందులో అక్షయ, రిషిక, జెస్సీ 9.0 జీపీఏ సాధించారు. అలాగే, గాడిపల్లిలోని ప్రభుత్వ స్కూల్లో 9 మంది విద్యార్థులకు ఐదుగురు ఉత్తీర్ణులయ్యారు. పర్వతగిరి మండలంలోని కల్లెడ ఆర్డీఎఫ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 97 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో నిమ్మల అనూష 9.8 జీపీఏతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కరస్పాండెంట్ అశోకాచారి తెలిపారు. తోటకూరి శరణ్య 9.5 జీపీఏతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మోడల్ స్కూల్లో ఉప్పుల సౌజన్య, బైరి వెంకటరామకృష్ణ 9.8 జీపీఏ సాధించినట్లు ఎంఈవో చదువుల సత్యనారాయణరావు తెలిపారు.
హనుమకొండ జిల్లాకు 11వ స్థానం
హనుమకొండ సిటీ, మే 10: పదో తరగతి ఫలితాల్లో బాలికలు ముందంజలో నిలిచారు. 91. 05 శాతంతో రాష్ట్రంలో హనుమకొండ జిల్లా 11వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 12 మేనేజ్మెంట్ల నుంచి 6002 బాలురు, 5718 బాలికలు కలిపి మొత్తం 11,720 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 10,671(91.05) శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టీఎస్ ఆర్ఈ ఐఎస్ మొదటి స్థానంలో నిలువగా రెండో స్థానంలో మైనార్టీ వెల్ఫేర్, మూడో స్థానంలో ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ సూళ్లు నిలిచాయి. చివరి స్థానంలో కేజీబీవీ నిలిచింది. జిల్లాలో మొత్తం 314 స్కూళ్లకు 69 స్కూళ్ల నుంచి 394 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. టెన్త్ ఫలితాల్లో ఐనవోలు మండలంలో ప్రథమ స్థానం, కమలాపురం మండలం చివరిస్థానంలో నిలిచింది.
‘సర్కారు’ విద్యార్థుల ప్రభంజనం
ఎల్కతుర్తి/కమలాపూర్/పరకాల/శాయంపేట: ఎల్కతుర్తి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 10వ తరగతిలో 88.59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఎంఈవో ఈసరి రవీందర్ తెలిపారు. 140 మంది బాలురకు 114, 228 మంది బాలికలకు 212 మంది ఉత్తీర్ణత సాధించారు. సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు చెందిన రిషిత 9.8 జీపీఏ, బీ హాసిని 9.7, మోడల్ స్కూల్కు చెందిన హరీశ్ 9.3, దామెర పాఠశాలకు చెందిన పీ సుస్మిత 9.2, కేజీబీవీకి చెందిన బీ అంజలి 9.2 జీపీఏ సాధించినట్లు ఎంఈవో తెలిపారు. కమలాపూర్ మండలంలో 613 మందికి 460 మంది పాసయ్యారు. మోడల్ స్కూల్ విద్యార్థి ఎస్ మాధవన్ 10/10 జీపీఏ, ఎంజేపీ బాలుర విద్యార్థి తరుణ్ 9.8 జీపీఏ, ఎంజేపీ(బాలికలు) సంజన 9.7 జీపీఏ సాధించారు.
ఉప్పల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎండీ సమ్రీం 9.5 జీపీఏ, కమలాపూర్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని సంజనశ్రీ 9.2 జీపీఏ సాధించారు. పరకాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల(సక్సెస్) పాఠశాలలో గువ్వ వినయ్ 9.7 జీపీఏ, బొచ్చు రాహుల్, బొచ్చు విలియం పాల్ 9.5, మదిగొండ శశికుమార్ 9.3 జీపీఏ సాధించారు. పట్టణ శివారులోని ఆత్మకూరు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు 93.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 76 మందికి 71 మంది ఉత్తీర్ణులయ్యారని హెచ్ఎం కృష్ణకుమారి తెలిపారు. శ్రీనిధి 9.5 జీపీఏ సాధించింది. మల్లక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 100 శాతం రిజల్ట్ వచ్చినట్లు హెచ్ఎం శోభారాణి తెలిపారు. శాయంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 85.99 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 257 మందిలో బాలురు 10, బాలికలు 26 మంది ఫెయిల్ అయ్యారు.
జడ్పీహెచ్ఎస్ పెద్దకోడెపాక 93 శాతం, గట్లకానిపర్తి స్కూల్లో 89.47 శాతం, నేరేడుపల్లి 66.67 శాతం, మాందారిపేట 37.50 శాతం, జడ్పీహెచ్ఎస్ బాలికలు(శాయంపేట) 86.67 శాతం, జడ్పీహెచ్ఎస్ బాలుర(శాయంపేట) 100 శాతం, గంగిరేణిగూడెం 94.12 శాతం, కేజీబీవీ 58.82 శాతం, ఎంజేపీ బాలుర 97.37, సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల 93.06 శాతం ఉత్తీర్ణత సాధించారు. శాయంపేటలో జడ్పీహెచ్ఎస్ బాలురలో 11 మందికి అందరూ పాసయ్యారు. అల్లం అక్షిత్ 9.2 జీపీఏ సాధించినట్లు హెచ్ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. మాందారిపేట జడ్పీహెచ్ఎస్లో 8 మందికి ముగ్గురు ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీలో 34 మందికి 20 మంది ఉత్తీర్ణులయ్యారు. పెద్దకోడెపాక జడ్పీ స్కూ ల్లో మంచి ఫలితాలు రావడంతో సర్పంచ్ అబ్బు ప్రకాశ్రెడ్డి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు రాహుల్ 9.7 జీపీఏ, రిత్విక్రెడ్డి 9.2, పూర్ణచందర్ 9.0 జీపీఏతో మండల టాపర్లుగా నిలిచారు.