నర్సంపేట రూరల్, డిసెంబర్ 21: సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమనేది నానుడిగా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులతోపాటు 15 కుటుంబాల సభ్యులు బీఆర్ఎస్లో బుధవారం చేరారు.
ఈ సందర్భంగా చంద్రయ్యపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 2వ వార్డు సభ్యులు బాషబోయిన జమున-శ్రీనివాస్, 3వ వార్డు సభ్యులు వీరమళ్ల కవిత-చంద్రశేఖర్, నాయకులు బాషబోయిన రవి, బాషబోయిన రాజన్న, బాషబోయిన రాజు, గణేశ్, సురేశ్, వీరమళ్ల కుమారస్వామి, సింగనబోయిన రాజు, బొమ్మర కుమారస్వామి, శ్రీనుతోపాటు మరో 15 కుటుంబాలకు చెందిన వారికి పెద్ది గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతో మంది బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని గుర్తుచేశారు.
ఈ నమ్మకంతోనే తాజాగా నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామం నుంచి అనేక కాంగ్రెస్ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, సర్పంచ్ బరిగెల లావణ్య, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, నాయకులు బరిగెల కిశోర్కుమార్, పెద్ది తిరుపతిరెడ్డి, నవీన్, ఐలయ్య, వాంకుడోత్ రాజన్న, రాచర్ల నాగరాజు, అజ్మీరా పాపయ్య, సముద్రాల సమ్మయ్య, బయ్య నవీన్ పాల్గొన్నారు.
జీపీలకు భవనాల మంజూరుపై హర్షం
గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు చేయడం హర్షణీయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో పది గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒక్కో భవనానికి రూ. 20 లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే పెద్దికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చంద్రయ్యపల్లి సర్పంచ్ బరిగెల లావణ్య, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, పెద్ది తిరుపతిరెడ్డి, నవీన్, రమేశ్, రాజు, తిరుపతి, వెంకన్న, సురేశ్, శంకర్ పాల్గొన్నారు.
ముందస్తుగా నాట్లు వేసుకోవాలి
ఖానాపురం: రాష్ట్ర సాగు ప్రణాళికను అనుసరించాలనే ఉద్దేశంతో ముందస్తుగా యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పాకాల ఆయకట్టు రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాలని కోరారు. పాకాల ఆయకట్టులో బుధవారం ఆయన యాసంగి సాగుకు ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్తో కలిసి నీటిని విడుదల చేశారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ పాకాల చరిత్రలో యాసంగిలో 14,500 అధికారికంగా, మరో నాలుగు వేల ఎకరాలకు అనధికారికంగా సాగుకు నీటిని విడుదల చేయడం తొలిసారి అన్నారు.
యాసంగిలో చివరి ఆయకట్టు వరకూ నీరందించే వరకూ తన సొంత నిధులతో పంట కాల్వలకు మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మరో ఐదు రోజుల్లో పనులు పూర్తవుతాయన్నారు. పాకాల రైతులు స్టేట్ షెడ్యూల్కు 40 రోజులపాటు వెనుకకు పంటలను సాగు చేస్తున్నారన్నారు. దీంతో రైతులకు వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గుతున్నట్లు వివరించారు. దీంతోపాటు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాకాల ఆయకట్టు కింద సాగును ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ముందస్తుగా నీటిని విడుదల చేశామని వెల్లడించారు. రైతులకు క్రాఫ్ హాలిడే ఇవ్వకుండానే కాల్వల శాశ్వత మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. రైతులు నీటి వృథాని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఉపేందర్రెడ్డి, అశోక్నగర్ సర్పంచ్ గొర్రె కవిత, సర్పంచ్ ఐలయ్య, బొప్పిడి పూర్ణచందర్, బందారపు శ్రీను, ఐబీ అధికారులు పాల్గొన్నారు.
6 కిలో మీటర్లు కలియతిరిగి..
పాకాల ఆయకట్టులో యాసంగి సాగు కోసం చేపడుతున్న పంట కాల్వల మరమ్మతు పనులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరు కిలో మీటర్ల మేర బైక్పై తిరిగి పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జాలుబంధం కాల్వ మరమ్మతులను పరిశీలించి, పొలంలో మిర్చి రైతులతో కాసేపు మాట్లాడారు. ఏటా పంట మార్పిడి చేసుకోవాలని, అప్పుడే తెగుళ్ల బాధ తప్పుతుందని వారికి సూచించారు. ఐదు రోజుల్లో పంట కాల్వల మరమ్మతులు పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.