పరకాల, జూన్ 29: బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పట్టణంలోని మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని కలిగి ఉండాలని, పేదలకు సాయం చేస్తే అల్లాకు సేవ చేసినట్లేనని మత పెద్దలు బోధించారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట : మండలంలో గురువారం బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాల వద్ద ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు చేయించారు. అనంతరం పేదలకు దానం చేశారు. పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాల్లో సందడి నెలకొంది.
సంగెంలో..
సంగెం : మండలంలో బక్రీద్, తొలిఏకాదశి వేడుకలు గురువారం ఇరు వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. హిందువుల పండుగ తొలిఏకాదశి, ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. హిందువులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేయగా, ముస్లింలు మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలయ్ బలయ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావుకు మండల కోఆప్షన్ సభ్యుడు మన్సూర్అలీ ఎమ్మెల్యే నివాసంలో కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎండీ ఖాజపాషా, రఫిక్పాషా, మైనుద్దీన్, ఫక్రుద్దీన్, యాకూబ్పాషా, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేటలో..
శాయంపేట : మండల వ్యాప్తంగా హిందువులు తొలి ఏకాదశి, బక్రీద్ను ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త దుస్తులు ధరించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హిందువులు, ముస్లింలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, రాజ్మహ్మద్, అబ్దుల్లా, రఫి, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే తొలిఏకాదశి సందర్భంగా ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు హాజరై పూజ చేశారు. రెండు పండుగలు ఒకేరోజు రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
దామెరలో..
దామెర : మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఊరుగొండలో వైస్ ఎంపీపీ జాకీర్అలీ, కోగిల్వాయిలో మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అక్తర్ మసీదు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే ల్యాదెళ్ల, దామెర, పసరగొండ తదితర గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందువులు, ముస్లింలు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో హుసునుద్ద్దీన్, మొబీనుద్దీన్, అన్వర్పాషా, అఫ్సర్, యూసూబ్ పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : మండలంలోని తురుకల సోమారం, అన్నారం షరీఫ్, వడ్లకొండ, కొంకపాక, ఏనుగల్లు తదితర గ్రామాల్లో బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. దైవ ప్రవక్తల త్యాగాన్ని స్మరించుకున్నారు. శాంతియుతంగా పండుగను జరుపుకున్నారు.
రాయపర్తిలో..
రాయపర్తి : మండలంలోని ముస్లింలు ఈద్-ఉల్-ఆదా వేడుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ముస్లింలు బుధవారం ప్రత్యేక వంటకాలు చేసి తమ పూర్వీకుల ఆత్మలు శాంతించాలని కోరుతూ ఫాతీహాలు ఇచ్చి కుటుంబాల సమేతంగా సామూహిక భోజనాలు చేశారు. ఈద్గాల వద్ద మత గురువులు, ఇమామ్సాబ్ల సారథ్యంలో ప్రత్యేక నమాజులు చదివారు. ప్రార్థనల అనంతరం ఖబరస్థాన్లకు వెళ్లి పూర్వీకుల సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో మహ్మద్ లాయఖ్అలీ, మహ్మద్ నయీం, మహ్మద్ బాషామియా, అక్బర్, అబ్దుల్ రహమాన్, అస్గర్అలీ, చాంద్పాషా, మైపాషా, షరీఫ్, రఫీక్, మైనుద్దీన్, మహమూద్, అజీమ్, షకీల్, రఫీ, కమ్రుద్దీన్, చాంద్పాషా, సలీం, మోమిన్అలీ, రియాజుద్దీన్, రజాక్పాషా, రహీముద్దీన్, హుస్సేన్, సాహెబ్ హుస్సేన్, యాకూబ్పాషా, షబ్బీర్, యాసిన్, వసీం, ఖాసీం పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : మండలంలోని అన్ని గ్రామాల్లోని మసీదుల్లో గురువారం ముస్లింలు బక్రీద్ వేడుకలు జరుపుకున్నారు. సర్పంచ్ రబీయాబీ హుస్సేన్, మసీదు అధ్యక్షుడు వలీహుస్సేన్, నవీర్ఖరీం, ఇఫ్తాకర్, ముజాహిద్, ఖాసీంహుర్, కమల్ మదర్, బషీర్, యాకూబ్, మజీద్, మౌలీసాబ్ పాల్గొన్నారు. అలాగే మండలంలోని ముస్లింలకు రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. గూడెప్పాడ్ గ్రామానికి చెందిన ఎండీ బాబుమియా ఇంట్లో జరిగిన బక్రీద్ వేడుకల్లో నాగుర్ల పాల్గొన్నారు. గూడెప్పాడ్ మార్కెట్ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు, బీఆర్ఎస్ నాయకులు అంకతి రవి, ఇమ్మాన్యుయేల్, సాంబరెడ్డి, షమీం పాషా, సమీర్ పాషా, లక్ష్మారెడ్డి, ఐలయ్య, కుమార్, సునీల్, రఘు పాల్గొన్నారు.