సోమేశ్వర లక్ష్మీనరసింహ, బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో అభిషేకం, వరుణ జపం
దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు పూజలు
పాలకుర్తి , జూలై 14 : వరుణుడు శాంతించాలని కోరు తూ చండికా సమేత సోమే శ్వర లక్ష్మీనరసింహాస్వామి క్షీరగిరిక్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజలు చేశా రు. వర్షాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని దేవాదాయ శాఖ ఉత్తర్వులు మేరకు.. ప్రజా శ్రేయ స్సు కోసం ప్రత్యేక పూజలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ముంజ రాములు, బండారి శ్రీనివాస్, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, శ్యామ్, సంతోష్ పాల్గొన్నారు
చిల్పూరులో..
మండలంలోని బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణుడు శాంతించాలని గురువారం ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రత్యేక పూజలు చేశామన్నారు. అనం తరం విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు మీద చిల్పూరు ఆలయంలో పూజలు చేసి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేసినట్లు చైర్మన్ శ్రీధర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వంశీ కృష్ణమాచార్యులు, ఆలయ ఈవో లక్ష్మిప్రసన్న, బీ రవీందర్ శర్మ, రంగాచార్యులు, మార్కెట్ డైరెక్టర్ శ్యాంసుందర్రెడ్డి, ఆలయ సిబ్బంది రమేష్, వీరన్న, కృష్ణ, శ్రీలత, లత, లక్ష్మీ, శేఖర్, మల్లికార్జున్, మహేష్, విశాల్, హరిశంకర్, వసంత, స్వరూప, భక్తులు పాల్గొన్నారు.