గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ 49వ డివిజన్లోని న్యూ మిలీనియం బ్యాంకు కాలనీలో రూ.1.12 కోట్ల అమృత్, సాధారణ నిధులతో నిర్మించిన పార్కును శుక్రవారం ఆయన గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు.
న్యూశాయంపేట, ఆగస్టు 5 : ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు నగరంలో పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. గ్రేటర్ 49వ డివిజన్లోని న్యూ మిలీనియం బ్యాంకు కాలనీలో రూ.1.12 కోట్ల అమృత్, సాధారణ నిధులతో ఏర్పాటు చేసిన పార్కును శుక్రవారం ఆయన మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్కు ఆవరణను కాలనీవాసులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో నగర ప్రజలకు వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో ఖాళీ స్థలాలు, లే ఔట్లను పరిరక్షించడంతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదం పంచడానికి థీం పార్కులు, జిమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగానే న్యూమిలీనియం బ్యాంకు కాలనీలో పార్కును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. త్వరలో జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ స్థానిక కాలనీ కమిటీతో ఎంఓయూ కుదుర్చుకుంటారని వివరించారు. పార్కులో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్లను పరిరక్షించుకోవడానికి ఆయా కాలనీ కమిటీలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సీహెచ్వో శ్రీనివాసరావు, హెచ్వో ప్రెసిల్లా, ఈఈ లక్ష్మారెడ్డి, డీఈ సంతోష్బాబు, ఏఈ అరవింద, టీఆర్ఎస్ 49వ డివిజన్ అధ్యక్షుడు సమద్ తదితరులు పాల్గొన్నారు.